నిహారిక కొణిదెల తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. మెగా డాటర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తోంది. నటుడు, నిర్మాత, జనసేన పార్టీ నేత కొణిదెల నాగబాబు కూతురుగా తెలుగు ఆడియెన్స్ కు బాగా పరిచయం అయ్యింది. తొలుత హీరోయిన్ గా పలు చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. మరోవైపు నిర్మాతగానూ మంచి సక్సెస్ ను అందుకుంటోంది. ఇదిలా ఉంటే.. నిహారిక కొణిదెల గురించి ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది. తను రెండో పెళ్లికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
నిహారిక.. కొణిదెల నిహారిక 2015 నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటోంది. మెగా డాటర్ గా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నర్సింహ రెడ్డి, డార్లింగ్, వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ పెద్దగా బ్లాక్ బాస్టర్ హిట్స్ ను అందుకోలేక పోయింది. మరోవైపు పలు వెబ్ సిరీస్ ల్లోనూ నటించినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. డెడ్ పిక్సెల్స్, బెంచ్ లైఫ్ వంటి సిరీస్ ల్లో నటించింది. నటిగా పెద్ద సక్సెస్ అందుకోలేకపోయినా… నిర్మాతగా మాత్రం సక్సెస్ అయ్యింది. పింక ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో నిర్మించిన కమిటీ కుర్రాళ్లు చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. రూ.10 కోట్లతో నిర్మించిన ఈ చిత్రానికి రూ.25 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయ్యింది.
అయితే నిహారిక నిర్మాతగా వచ్చిన ‘కమిటీ కుర్రాళ్లు’ చిత్రం తర్వాతనే నిహారిక రెండో పెళ్లిపై వార్తలు వస్తున్నాయి. అయితే కమిటీ కుర్రాళ్లు చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ హాజరవడంతోనే ఈ కహానీ మొదలైందని తెలుస్తోంది. ఆ ఈవెంట్ తర్వాత నుంచే నిహారిక, సిద్ధూ క్లోజ్ అయ్యారని వారిద్దరి మధ్య బంధం ఏర్పడిందంటున్నారు. అయితే ఈ విషయంపై ఇంట్లో వాళ్లతోనూ చర్చలు జరుగుతున్నాయని ప్రముఖులు చర్చించుకుంటున్నారు. కానీ దీనిపై క్లారిటీ లేదు. మున్ముందు దీనిపై ఎలాంటి అప్డేట్ వస్తుందనేది వేచి చూడాలి.
నాగబాబు కూతురు నిహారిక కొణిదెల చైతన్య జొన్నలగడ్డను 2020 లాక్ డౌన్ లోనే పెళ్లి చేసుకుంది. మెగా ఫ్యామిలీ వారి పెళ్లిని ఘనంగా జరిపించారు. కానీ ఏమైందో ఏమో గానీ 2023లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. వారి నిర్ణయం అప్పట్లో సంచలనంగా మారింది. ఇక అప్పటి నుంచి నిహారిక సింగిల్ గానే ఉంటోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఇలా రెండో పెళ్లి అంటూ రూమర్లు వినిపిస్తున్నాయి.
చివరిగా నిహారిక కొణిదెల మద్రస్కారన్ అనే తమిళ చిత్రంలో ప్రేక్షకులను అలరించింది. 2025 జనవరి 10న కేవలం తమిళంలోనే విడుదలైంది. ఆ చిత్రంలో నిహారిక కొణిదెల మీరా అనే పాత్ర పోషించింది. ఇక తెలుగులో మంచు మనోజ్ తో ఓ సినిమా చేస్తుందని తెలుస్తోంది. ‘వాట్ ది ఫిష్’ అనే చిత్రంలో అష్ట లక్ష్మి అనే పాత్రలో నటిస్తోంది. మున్ముందు ఇంకెలాంటి చిత్రాల్లో నటిస్తుందనేది వేచి చూడాలి.