తెలుగు ప్రేక్షకులకు నటుడు నారా రోహిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగులో నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నారా రోహిత్. చాలాకాలం తర్వాత వెండితెరపై కనిపించిన విషయం తెలిసిందే. ఆయన లేటెస్ట్ గా నటించిన చిత్రం భైరవం. విజయ్ కనక మేడల దర్శకత్వంలో ఆయన తాజాగా నటించిన చిత్రం భైరవం. ఇందులో నారా రోహిత్ తో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ లు నటించిన విషయం తెలిసిందే. ఇందులో ఆనంది, అతిథి శంకర్, దివ్యా పిళ్లై హీరోయిన్ లుగా నటించారు.
అయితే తాజాగా మే 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నారా రోహిత్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. భైరవం నారా రోహిత్ కు మంచి కమ్ బ్యాక్ సినిమా అయ్యిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో కూడా రోహిత్ బాగా యాక్టివ్ గా పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొన్ని ఇంటర్వ్యూలలో కూడా పాల్గొన్నారు. సినిమాకు సంబంధించిన విషయాలు తర్వాత వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. ఇదే క్రమంలో తన పెళ్లి గురించి కూడా ఓ క్లారిటీ ఇచ్చాడు. నారా రోహిత్, సిరిలేళ్ల నిశ్చితార్థం గత ఏడాది అక్టోబర్లో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, బాలకృష్ణ అలాగే కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. అయితే నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు (72) నవంబర్ లో కన్నుమూశారు. దీంతో పెళ్లిని వాయిదా వేసుకున్నాడు నారా రోహిత్. అయితే త్వరలోనే శిరీషతో ఏడడుగులు నడవనున్నట్లు వెల్లడించాడు ఈ హీరో. ఈ ఏడాది అక్టోబర్ లో సిరితో తన పెళ్లి జరగబోతున్నట్లు రోహిత్ అధికారికంగా ప్రకటించాడు. అప్పటికి తన పెళ్లికి లైన్ క్లియర్ అవుతుందని నారా వారి హీరో చెప్పుకొచ్చాడు.