నెల్లూరు నగర మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు టీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడ 2020-21 మధ్య జరిగిన ఎన్నికల్లో వైసీపీ మెజారిటీ దక్కించుకుంది. దీంతో మేయర్ పీఠం ఆ పార్టీకే దక్కింది. అయి తే. కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. సహజంగానే మార్పులు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే మేయర్ స్రవంతిని గద్దె దింపాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 18న ఆమెపై అవిశ్వాసం కూడా పెట్టనున్నారు. ఈ అవిశ్వాసంలో టీడీపీ విజయం దక్కించుకుంటే.. నెల్లూరు మేయర్ పీఠం ఈ పార్టీకి దక్కుతుంది.
మంత్రి పొంగూరు నారాయణ సొంత జిల్లా, పైగా సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ టీడీపీని పరుగు లు పెట్టించాలని భావించారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నుంచి 40 మందిని పార్టీలోకి తీసుకువచ్చారు. వీరి ద్వారా అవిశ్వాసం ప్రవేశ పెట్టి.. ఇప్పుడు ఈ సీటును కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నిజానికి ఈ ప్రయత్నంలో మంత్రి తీవ్రస్థాయిలో మంత్రాంగాన్ని నడిపారు. అయినా.. ఆయన ఊహించినట్టుగా మాత్రం ఎక్కడా పరిస్థితి కనిపించడం లేదు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పటి వరకు వైసీపీలో ఉండి.. ఇటీవల టీడీపీ లో చేరిన కార్పొరేటర్లు.. ఐదుగురు తిరిగి జగన్ చెంతకు చేరుకున్నారు. దీంతో బలాబలా మధ్య ఇద్దరు ముగ్గురు కార్పొరేటర్ల తేడా ఉంది. ఈ నేపథ్యంలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలను తమ చెంతకు తీసుకు నేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయం తెలియగానే టీడీపీ క్యాంపు రాజకీయాలకు తెరదీ సింది. కార్పొరేటర్లను వేరే ప్రాంతానికి పంపించారు.
ఇక, అవిశ్వాస తీర్మానంపై ఈ నెల18న కౌన్సిల్లో చర్చించనున్నారు. ఆ రోజు జరిగే ఎన్నిక ద్వారా టీడీపీ తరఫున మేయర్ను ఎన్నుకుంటారు.కానీ.. ఈ అవకాశం చిక్కుతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే.. వైసీపీ కూడా దూకుడానే ఉంది. పైగా మాజీ మంత్రి అనిల్కుమార్ సొంత ఇలాకా కూడా కావడంతో ఎట్టి పరిస్థితిలోనూ ఈ సీటును వదులు కోరాదని నిర్ణయించారు. దీంతో ఈ నెల 18న ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది.
నెల్లూరు మేయర్ పదవి కోసం అధికార కూటమి తో పాటు విపక్ష వైసీపీల మధ్య అతి పెద్ద పొలిటికల్ వార్ సాగుతోంది. గట్టిగా నాలుగు నెలలు కూడా లేని ఈ పదవి కోసం ఎందుకు పోరు అంటే అదే రాజకీయంగా ప్రతిష్ట అని అంటున్నారు. ఇక చూస్తే నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యేగా 2019 నుంచి 2024 మధ్యలో మాజీ మంత్రి వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ ఉండేవారు, రూరల్ కి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు. ఇక మేయర్ ఎన్నికల్లో అనాడు కోటం రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఫలితంగా ఆయన వర్గానికే పీఠం దక్కింది. ప్రస్తుతం మేయర్ గా ఉన్న స్రవంతి కోటం రెడ్డి అనుచరురాలు అని అంటారు అయితే ఆమె కూటమి అధికారంలోకి వచ్చాక అటూ ఇటూ మారారు. ఇక మేయర్ గా ఆమెని దించేసి తన మనిషిని గెలిపించుకోవాలని కోటం రెడ్డి పట్టుదలగా ఉన్నారు. ఇక నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్న వారు సాక్షాత్తూ మున్సిపల్ మినిస్టర్ కావడంతో నెల్లూరు మేయర్ మీద అవిశ్వాసం ప్రతిపాదించారు. దాంతో ఈ నెల 18న అవిశ్వాసం మీద ప్రత్యేక సమావేశం నిర్వహించి ఓటింగ్ చేపట్టనున్నారు.
ఇదిలా ఉంటే 2021లో నెల్లూరు కార్పోరేషన్ కి ఎన్నికలు జరిగినపుడు మొత్తం 53 కార్పోరేటర్లూ వైసీపీ సొంతం అయ్యారు. విపక్షానికి కార్పోరేషన్ లో ఒక్క సీటూ లేదు. కానీ 2024 ఎన్నికల తరువాత సీన్ మారింది. అందులో ఏకంగా 40 మంది వైసీపీ కార్పోరేటర్లు విడతల వారీగా కూటమిలో చేరిపోయారు. ఇక వైసీపీకి మిగిలింది 13 మంది మాత్రమే అని అంటున్నారు. అధికారికంగా చూస్తే మేయర్ గా వైసీపీకి చెందిన స్రవంతి ఉన్నా అనధికారికంగా టీడీపీదే పెత్తనం సాగుతోంది. ఇపుడు మేయర్ నే టీడీపీకి చెందిన వారిని తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే అవిశ్వాసం నోటీసు ఇచ్చారు.
ఇక వైసీపీ చేతిలో ఉన్న మేయర్ పీఠం టీడీపీకి చెందకుండా ఆ పార్టీ గట్టి చర్యలు తీసుకుంటోంది. రంగంలోకి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దిగిపోయారు. ఆయన చొరవతో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన వారిలో అయిదురుగు కార్పోరేటర్లు తిరిగి వైసీపీ గూటికి చేరారు దాంతో వైసీపీ బలం కాస్తా 18కి పెరిగింది. మరి కొందరిని తమ వైపు తిప్పుకుంటే కార్పోరేషన్ లో మేయర్ మీద అవిశ్వాసాన్ని ధీటుగా తిప్పికొట్టవచ్చు అని వైసీపీ ఆలోచిస్తోంది. ఈ నేపధ్యంలో అనిల్ కుమార్ అయితే తన సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు.
ఇంకో వైపు చూస్తే కనుక కోటం రెడ్డి శ్రీధర్ పట్టుదలగా ఈ విషయనని తీసుకున్నారు. ఎలాగైనా తన మనిషిని మేయర్ పీఠం మీద కూర్చోబెట్టాలని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ హవా చలాయించేందుకు ఇది ఉపకరిస్తుంది అని ఆయన నమ్ముతున్నారు. దాంతో తమ వైపు ఉన్న కార్పోరేటర్లతో క్యాంప్ రాజకీయాలకు తెర తీశారు అని అంటున్నార్.అయితే అనిల్ కుమార్ యాదవ్ సైతం వైసీపీ పట్టు జారకూడదని చూస్తున్నారు. దీంతో ఈ ఇద్దరు నేతల మధ్య మేయర్ ఎన్నికల రాజకీయం హీటెక్కిస్తోంది. మొత్తానికి చూస్తే ఈ నెల 18న మేయర్ మీద అవిశ్వాసం మాత్రం రాజకీయంగా సంచలనంగా మారే అవకాశం ఉంది అని అంటున్నారు.














