*అమరావతి రైతు కుటుంబాలను, మహిళలను కించపరచడం అనడం దారుణాతిదారుణం*
*మహిళలను అవమానించిన సాక్షి మీడియాపై చర్యలు తప్పవు-మంత్రి నిమ్మల రామానాయుడు*
ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో పరిరక్షించడంలో ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా పాత్ర అమోఘము,అద్భుతం. దురదృష్టం కొద్దీ అలాంటి మీడియా ముసుగులో సాక్షి ఛానల్, పత్రిక ప్రతినిత్యం ప్రభుత్వంపై విషం కక్కుతోందని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దుయ్యబట్టారు. సోమవారం రాజమండ్రిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
అక్రమాలకు, అవినీతికి వేదికైన సాక్షి మీడియా అమరావతి రాజధానిని వేశ్యల రాజధాని అంటూ అభివర్ణించటం అత్యంత హేయమైన చర్యగా రామానాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ చర్య అమరావతి రాజధాని మహిళా రైతులను మాత్రమే కాకుండా యావత్తు మహిళా లోకాన్ని కించపరచడమే అన్నారు. వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడడమేనని ఆయన దుయ్యబట్టారు. ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో,. ఎక్కడ మహిళలు సుఖసంతోషాలతో ఉంటారో అక్కడ దేవతలు సంచరిస్తారని, ఆ ప్రాంతం సిరిసంపదలతో తులతూగుతుందని నిమ్మల పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని నమ్మి…
13 జిల్లాలకు కేంద్ర బిందువుగా ఉన్న అమరావతి రాజధానికి కించిత్తు నిరసన గాని ఉద్యమంగాని, వ్యతిరేకత గాని లేకుండా 33 వేల ఎకరాల భూములు స్వచ్ఛందంగా ఇచ్చిన సంగతి మంత్రి గుర్తు చేశారు. ఔదార్యాన్ని చాటుకున్న అమరావతి రైతు కుటుంబాల ను, రైతులను, ప్రత్యేకించి మహిళా మూర్తులను , వారి వ్యక్తిత్వాన్ని దిగజారుస్తూ అవినీతి సాక్షి మీడియా దారుణమైన దుర్మార్గానికి ఒడిగట్టింది అన్నారు. పక్షపాత రాహిత్యంగా ఉండాల్సిన మీడియా వైకాపాకు కొమ్ము కాస్తూ ఆ పార్టీ రాజకీయ ప్రయోజనాలను, ఎజెండాను అమలు చేస్తుందని నిమ్మల విమర్శించారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ సైతం అమరావతి రాజధాని కి మద్దతు పలుకుతూ 30 వేల ఎకరాలు భూములు కావాలని చెప్పి, అధికారంలోకి వచ్చిన వెంటనే ప్లేటు ఫిరాయించి మూడు ముక్కలాట మొదలెట్టిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. అలాగే అమరావతి రాజధాని కోసం ఆనాడు ఉవ్వెత్తున లేచిన ఉద్యమంలో మహిళామ తల్లుల పాత్ర మరువలేనిది అన్నారు. అప్పుడు కూడా దుర్మార్గ వైకాపా ప్రభుత్వం ఉద్యమంలో పాల్గొన్న మహిళల కుచ్చళ్లను లాగి, లాఠీ ఛార్జ్ చేసి తీవ్రంగా అవమానించింది అన్నారు. ఇప్పుడు మళ్లీ అమరావతిపై విష ప్రచారం మొదలెట్టడమే కాకుండా వేశ్యల రాజధాని అనడం క్షమించరాని నేరం గా ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై రాష్ట్ర మహిళా లోకం యావత్తు నివ్వెర పోయింది. నిరసన వ్యక్తం చేస్తుందని రామానాయుడు చెప్పారు. సీనియర్ పాత్రికేయుడైన కొమ్మినేని శ్రీనివాసరావు ఒకవైపు వారిస్తున్నట్లు నటిస్తూనే డిబేట్ ను కొనసాగించటం, జర్నలిస్టు ముసుగులో వైకాపాకు కొమ్ముకాస్తున్న కృష్ణంరాజుకు మద్దతు పలకడం అంటే ఆ పార్టీ విష ప్రచార ఎజెండా అమలు జర్పడ్డమే అని మంత్రి ఆక్షేపించారు. దేశంలోనే కాదు ప్రపంచంలో గొప్పగా ఉండే విధంగా అమరావతి రాజధాని నిర్మాణం జరపాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయంగా
మంత్రి చెప్పారు
అమరావతి వల్ల ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని, సంపద సృష్టి జరిగి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి రామానాయుడు పేర్కొన్నారు.. తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉండడానికి ఆ రాష్ట్ర ఆదాయంలో 62 శాతం ఒక హైదరాబాదు నుంచి రావడమే కారణం అన్నారు. . అలాగే అమరావతి పూర్తయితే మన రాష్ట్రం కూడా గొప్పగా వృద్ధి చెందటం సాధ్యమన్నారు. ఇలా రాష్ట్రం వృద్ధి చెందటం వైకాపాకు సుతరాము ఇష్టం లేదన్నారు. అందుకనే అమరావతిపై మీడియా ముసుగులో విష ప్రచారం చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటుంది అన్నారు. మనలో సగం..సమాజంలో సగం అయిన మహిళా మతల్లుల నిరసన మేరకు వారిని గౌరవించే కార్యక్రమంలో భాగంగా సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి చెప్పారు.