హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి గతేడాది ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 12న అతి కొద్దిమంది సమక్షంలో కీర్తి సురేశ్ వివాహం జరిగింది. తన ప్రియుడు ఆంటోనీనే కీర్తి సురేశ్ వివాహం చేసుకుంది. తన 15 ఏళ్ల ప్రేమను పరిచయం చేస్తూ మహానటి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చింది. కాలేజ్ డేస్ నుంచే లవ్ స్టోరీ నడిపించిన కీర్తి తాను సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించింది. తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుంది కీర్తి సురేశ్. కొద్ది రోజుల క్రితమే తన ప్రేమికుడు ఆంటోనీతో కీర్తి తన లవ్ కన్ఫర్మ్ చేసింది.
గోవాలో డిసెంబర్ 12న మ్యారేజ్ అని కూడా చెప్పారు. డిసెంబర్ 11-12 తేదీల్లో గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. పెళ్లికి సంబంధించిన పనులన్నీ కీర్తి సురేష్ దగ్గరుండి చూసుకుంది. మొదట హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్, తర్వాత తన భర్త ఆంటోనీ సంప్రదాయం క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంది.
ఇక పెళ్లి తతంగం ముగియగానే కీర్తి సురేశ్ తిరిగి తన సినిమా షూటింగ్ల్లో పాల్గొంటుంది. ప్రస్తుతం కీర్తి సురేశ్ ఖాతాలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అలాగే మరో బాలీవుడ్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కీర్తి సురేశ్ ప్రస్తుతం భర్తతో కలిసి వెకేషన్ను ఎంజాయ్ చేస్తోంది. భర్తతో కలిసి అమ్మడు మాల్దీవులకు వెళ్లింది. దీనికి సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ.. ఆమె మెడలో తాళిబొట్టు కనిపించకపోవడంతో నెటిజన్లు కీర్తి సురేశ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సినిమాల షూటింగ్ సమయంలో అంటే తాళిబొట్టు ఎలాగూ పెట్టుకోవు.. కనీసం భర్తతో అయిన బయటకు వెళ్లినప్పుడైనా తాళిబొట్టును పెట్టుకోవాలి కదా అంటూ కీర్తి సురేశ్ను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం తాళి బొట్టు వేసుకోవాలా లేదా అన్నది ఆమె ఇష్టమంటూ కీర్తి సురేశ్కు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం కీర్తి సురేశ్ భర్తతో కలిసి వెకేషన్కు వెళ్లిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.
https://www.instagram.com/p/DKuhrLwJ7To/?igsh=ZjFkYzMzMDQzZg==