తెలంగాణ రాష్ట్ర చూపు మొత్తం జూబ్లీహిల్స్ ఎన్నికపైకి మళ్లీంది. ఇక్కడ ఎవరు విజయం సాధిస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఓవైపు మరణించిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భార్య బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉంది. ఇంకోవైపు బిజెపి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పేరు ఫైనల్ అయిపోయింది. ఈ విధంగా ముక్కోనపు పోరులో ఎవరు విజయం సాధిస్తారు. ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సెంటిమెంట్ వర్కౌట్ చేయాలని చూస్తోంది. ఎందుకంటే అక్కడ లాస్ట్ టైం ఎలక్షన్స్ లో గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ మరణించడం ఆయన భార్య కి టికెట్ ఇవ్వడం వల్ల ఆ సెంటిమెంట్ తో ఎలాగైనా గెలవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రచారం కూడా సాగిస్తోంది.
ఇక్కడ విజయం సాధిస్తే మళ్లీ బీఆర్ఎస్ లో కొత్త ఊపు వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆశిస్తున్నారు. అలాంటి ఈ టైం లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ రంగంలోకి దిగారు. అయితే ఈయన ఇప్పటికే జూబ్లీహిల్స్ లో పలుమార్లు పోటీ చేసి ఓడిపోవడం తెలిసిన విషయమే. అలాంటి నవీన్ యాదవ్ గెలిచే అవకాశాలు ప్రధానంగా మూడు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం.. నవీన్ యాదవ్ 2014 ఎన్నికల్లో మజిలీస్ పార్టీ నుంచి పోటీ చేసి 41 వేల 656 ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచారు.. అంతేకాకుండా 2018 ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి 18,000 ఓట్లు సాధించారు. ఇక ఈ మధ్యనే కాంగ్రెస్ లో పార్టీ లో చేశారు. ఈ విధంగా రెండుసార్లు పోటీ చేసి ఓడిపోవడం నవీన్ యాదవ్ కు కలిసి వచ్చే అంశం.
ఇదే కాకుండా నవీన్ యాదవ్ స్థానికుడు కావడం ఆయనకు యూత్లో ఫాలోయింగ్ ఉండడం మరో విధంగా కలిసివస్తుంది. ఇక ప్రధానంగా ఆయనకు మజిలీస్ పార్టీ నుంచి ముస్లింలంతా సపోర్ట్ చేయడం అనేది ఎంతోకాలంగా జరుగుతూ వస్తోంది. ఎన్నికల్లో కూడా మజిలీస్ పార్టీ ముస్లింలంతా ఆయనకు సపోర్ట్ చేస్తారు. ఇక ఇదే కాకుండా ఇంతకుముందు గెలిచిన వారంతా స్థానికేతరులే. కానీ ఈసారి నవీన్ యాదవ్ స్థానికుడు కావడం ఇదే అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం లాంటివి చేస్తున్నారు. ఇంకో అంశం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం నవీన్ యాదవ్ కి కలిసొచ్చే అంశం. ఈ విధంగా నవీన్ యాదవ్ కు ఏ వైపు చూసుకున్న గెలుపు అవకాశాలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
హైదరాబాద్ నగరంలోని ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం మరోసారి రాజకీయంగా హాట్స్పాట్గా మారింది. ఉపఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ వ్యూహాలను వేగంగా అమలు చేస్తూ, అభ్యర్థుల ఎంపికను పూర్తి చేస్తున్నాయి. ఈ నెల 13 నుంచి నామినేషన్లు ప్రారంభం కానుండగా, నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. ఫలితాలు నవంబర్ 14న వెలువడనున్నాయి. ఈ పరిణామాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. బుధవారం రాత్రి ఆలస్యంగా పార్టీ నాయకత్వం బీసీ వర్గానికి చెందిన యువ నాయకుడు నవీన్ యాదవ్ను జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎంపిక చేసింది.
నవీన్ యాదవ్ రాజకీయ జీవితం 2014లో ప్రారంభమైంది. రాష్ట్ర విభజన అనంతరం ఆయన ఎంఐఎంలో చేరి, అదే సంవత్సరం జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన రెండో స్థానంలో నిలిచినా, గెలుపు గుర్రం ఎక్కలేకపోయారు. అప్పటి నుంచి ఆయన నియోజకవర్గంలో నిరంతరం క్రియాశీలకంగా పనిచేస్తూ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. 2018లో టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా, అప్పుడు కేవలం 7,000 ఓట్లు మాత్రమే దక్కించుకుని డిపాజిట్ కూడా కోల్పోయారు. తర్వాత కాలంలో ఆయన కాంగ్రెస్ లో చేరి, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. 2023 ఎన్నికల్లో టికెట్ ఆశించినా దక్కలేదు. అయితే, పార్టీపై విశ్వాసం కోల్పోకుండా పనిచేస్తూ, ఈసారి చివరికి కాంగ్రెస్ అధినేతలు ఆయనకు అవకాశం కల్పించారు. ఆర్థికంగా బలమైన నాయకుడిగా, స్థానికంగా యువతలో కొంత ప్రాచుర్యం కలిగిన నేతగా పేరు తెచ్చుకున్నారు.
అయితే, నవీన్ యాదవ్కు గెలుపు అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వ్యక్తిగతంగా ప్రజల్లో పట్టు అంతగా లేకపోవడం, గత రెండు సార్లు ఓటమిపాలు కావడం ఆయనకు ప్రధాన సవాలు. అంతేకాకుండా, జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్, బీజేపీ బలంగా ఉండడం నవీన్కు అంత సులువు కాదు. అయినా అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం ఆయనకు పెద్ద అదృష్టం. ఇక ప్రస్తుత ఎన్నికల్లో యువత, బీసీ వర్గం ఓటు బ్యాంకును ఆకర్షించగలిగితేనే ఆయన గెలుపు సాధ్యమని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆయన వెనుక నిలబడి, వ్యూహాత్మక ప్రచారానికి సిద్ధమవుతోంది. మొత్తంగా, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నవీన్ యాదవ్ పోటీ రాజకీయంగా ఆసక్తికర మలుపు తిప్పే అవకాశముంది.