హరిహర వీరమల్లు రిలీజ్పై సందిగ్ధత కొనసాగుతుంది.. పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం “హరిహర వీరమల్లు” చుట్టూ మళ్లీ ఉత్కంఠ కొనసాగుతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే షూటింగ్ ముగిసి చాలా కాలం అయినా విడుదల తేదీపై మాత్రం ఇంకా స్పష్టత రావడం లేదు.
దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా, బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా, మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
సమాచారం ప్రకారం, షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం గ్రాఫిక్స్ మరియు వీఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. తొలుత జూన్ 12న రిలీజ్ చేస్తామన్నా, మేకర్స్ ఆ తేదీని వాయిదా వేశారు. ఇప్పటికీ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించలేదు.
ఇక ట్రైలర్ మరియు రిలీజ్ డేట్ అప్డేట్ను జూన్ 18న విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం లేదు.
ఇక సినిమా ఆలస్యంపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని పనులు పూర్తి కాకుండా రిలీజ్ డేట్ ప్రకటించవద్దని పవన్ నిర్మాతకు చెప్పినట్టు టాక్. వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కావడమే కాక, ఇతర ఆర్గనైజేషన్ లోపాలు కూడా ఉన్నాయని సమాచారం.
ఇప్పటికైనా స్పష్టమైన తేదీని ప్రకటిస్తే అభిమానులు ఊపిరి పీల్చుకుంటారు. వీరమల్లు ఎప్పుడు విడుదలవుతుందో వేచి చూడాల్సిందే.