ఆంధ్రప్రదేశ్లో మెగా DSC-2025 తుది ఎంపిక జాబితా అధికారికంగా విడుదలైంది. మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయింది.
జిల్లా విద్యాధికారి కార్యాలయాలు, కలెక్టరేట్లలో ఎంపికైన అభ్యర్థుల జాబితా అందుబాటులో ఉంచారు. అదేవిధంగా, మెగా DSC అధికారిక వెబ్సైట్ 👉 apdsc.apcfss.in లో కూడా ఎంపికల జాబితా చూసుకోవచ్చు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, “ఏపీ మెగా DSC-2025లో ఎంపికైన అభ్యర్థులకు హృదయపూర్వక అభినందనలు. రాష్ట్ర విద్యా రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కొత్తగా నియమితులవుతున్న టీచర్లు కీలక పాత్ర పోషిస్తారు” అని తెలిపారు.
📌 ప్రధానాంశాలు:
-
16,347 టీచర్ పోస్టుల భర్తీ పూర్తి
-
జిల్లా విద్యాధికారి, కలెక్టరేట్ కార్యాలయాల్లో లిస్ట్ అందుబాటులో
-
apdsc.apcfss.in వెబ్సైట్లో ఆన్లైన్లో లిస్ట్ లభ్యం
-
ఎంపికైన వారికి మంత్రి లోకేష్ శుభాకాంక్షలు
ఎక్స్ లో విడుదల చేసిన మంత్రి నారా లోకేష్*అమరావతిః మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితాను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతా ద్వారా విడుదల చేశారు. మెగా డీఎస్సీ హామీని నెరవేర్చాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన వెంటనే మెగా డీఎస్సీ ఫైల్ పై తన మొదటి సంతకం చేశారు.
150 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ విజయవంతంగా మెగా డీఎస్సీ-2025ను పూర్తిచేసింది.
ఫైనల్ లిస్ట్ సెలెక్షన్ లో ఉన్న విజయవంతమైన అభ్యర్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితా ఈ రోజు ఉదయం 9.30 నుంచి అధికారిక వెబ్ సైట్ www.apdsc.apcfss.in. ద్వారా అందుబాటులో ఉంచడం జరిగింది.ఈ మైలురాయి.. బాధ్యత, సేవతో కూడిన ఉపాధ్యాయ వృత్తి ఆరంభానికి సంకేతం. చిన్నారుల మేధస్సును తీర్చిదిద్దుతూ, మన విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ AP మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను ప్రతి తరగతి గదికి చేర్చే దిశగా మీరు ముందుకు సాగబోతున్నారు.నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులను ఆత్మీయంగా ఆహ్వానించి, వారికి మార్గనిర్దేశం చేయాలని ఉపాధ్యాయ వర్గానికి పిలుపు ఇస్తున్నాను.ఈ అవకాశం అందుకోలేకపోయిన వారు నిరుత్సాహ పడొద్దు. ఇచ్చిన హామీ ప్రకారం, ఇకపై ఏటా డీఎస్సీ నిర్వహించడం జరుగుతుంది. మీరంతా పట్టుదలతో సిద్ధం అవుతూ ఉండండి. అవకాశం తప్పకుండా వస్తుందని మంత్రి తెలిపారు.