దిల్ రాజు నిర్మిస్తున్న `ఆకాశం దాటి వస్తావా?` సినిమాతో టాలీవుడ్ కి పరిచయమవుతోంది ధనశ్రీ వర్మ. కొరియోగ్రాఫర్ గా సుపరిచితురాలైన ధనశ్రీ, ఇటీవల తన భర్త, క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. భారత దేశంలో అత్యంత చర్చనీయాంశమైన సెలబ్రిటీ విడాకుల కేసుల్లో ఇది ఒకటి. ప్రస్తుతం యూవీతో తాను స్నేహంగా ఉన్నానని, అంతా సెటిలైందని ధనశ్రీ తాజాగా కొరియోగ్రాఫర్ కం వ్లాగర్ ఫరాఖాన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఫరాఖాన్ తో చిట్ చాట్ లో ధనశ్రీ వర్మ కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసారు. అగ్రనిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న `ఆకాశం దాటి వస్తావా?` సినిమా గురించి ప్రస్థావిస్తూ.. ఇది డ్యాన్స్ బేస్డ్ డ్రామాతో రూపొందుతోందని, త్వరలో విడుదలకు రానుందని వెల్లడించింది. తనకు అత్యంత ఇష్టమైన డ్యాన్స్ నేపథ్యంలోని సినిమా చేయడం ఆనందాన్నిస్తోందని ధనశ్రీ పేర్కొంది. అలాగే తాను కొరియోగ్రాఫర్ కం నటిగా మారక ముందు ఆరంభం డెంటిస్టుగా బాంద్రా (ముంబై)లో క్లినిక్ నడిపానని కూడా ధనశ్రీ తెలిపారు. మూడేళ్ల పాటు దంత వైద్యురాలిగా క్లినిక్ ని నడిపానని వెల్లడించారు. “బాంద్రా – లోఖండ్వాలాలో ఒక క్లినిక్ ఉండేది. సినీతారలంతా నా క్లినిక్కి వచ్చేవారు.. నేను రణబీర్ కపూర్కు కూడా ఒకసారి చికిత్స చేసాను“ అని ధనశ్రీ గుర్తుచేసుకుంది.
అయితే ఆ సమయంలో ఫరా సరదాగా ప్రశ్నిస్తూ..నువ్వు అతడి నోటిలోకి చూశావా? ఎలా ఉంది? అదేమైనా భిన్నంగా ఉందా? అని ఛమత్కరిస్తూ నవ్వేసారు. దానికి ధనశ్రీ సమాధానమిస్తూ.. “అది నా పని.. దంతాలకు చికిత్స ఆరోగ్యకరమైనది.. మంచి పరిశుభ్రతనిస్తుంది“ అని అన్నారు. ధనశ్రీ గతంలో ఫరాఖాన్ హోస్ట్ చేసిన ఝలక్ దిఖలాజాలో పెర్ఫామ్ చేసింది. అలాగే బిగ్ బాస్ లోను కనిపించింది. తర్వాత కొరియోగ్రాఫర్ గా సొంత యూట్యూబ్ కంటెంట్ తోను పాపులరైంది. క్రికెటర్ చాహల్ తో డేటింగ్, పెళ్లి అనంతరం తక్కువ సమయంలోనే విడాకుల కారణంగా మరింతగా ప్రజల్లో పాపులరైంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే, అష్నీర్ గ్రోవర్ రియాలిటీ షో `రైజ్ & ఫాల్`లో ధనశ్రీ నటిస్తోంది. ఇది అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్లో ప్రీమియర్ కానుంది. ఆ తర్వాత దిల్ రాజు నిర్మిస్తున్న డ్యాన్స్ బేస్డ్ చిత్రం `ఆకాశం దాటి వస్తావా?` కూడా విడుదలకు రానుంది.
ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, డ్యాన్సర్ ధనశ్రీ వర్మ ఓ వ్లాగ్లో తన వ్యక్తిగత జీవితంలో జరిగిన మార్పుల గురించి మాట్లాడారు. భారత క్రికెటర్ యుజ్వేంద్ర చహల్తో తన నాలుగేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికినట్లు ధృవీకరించారు. ప్రస్తుతం తాను ఒంటరిగా కొత్త జీవితాన్ని ప్రారంభించానని, స్వాతంత్ర్యాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపారు. తన డ్యాన్స్ రియాలిటీ షో ‘ఝలక్ దిఖ్లా జా’లో పాల్గొన్న అనుభవాలను కూడా పంచుకున్నారు. అంతేకాకుండా, త్వరలో ‘రైజ్ అండ్ ఫాల్’ అనే మరో రియాలిటీ షోలో కూడా కనిపించనున్నట్లు ఆమె వెల్లడించారు
తన జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన నిజాన్ని కూడా ధనశ్రీ వర్మ ఈ వ్లాగ్ లో బయటపెట్టారు. డ్యాన్సర్గా, కంటెంట్ క్రియేటర్గా అందరికీ సుపరిచితమైన ఆమె, ఒకప్పుడు దంతవైద్యురాలిగా పనిచేశానని, ఆ సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్కు కూడా చికిత్స అందించానని వెల్లడించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్తో జరిపిన సంభాషణలో ఆమె ఈ విషయాలను పంచుకున్నారు.
ధనశ్రీ వర్మ ఇటీవల తన యూట్యూబ్ ఛానెల్ కోసం ఒక ప్రత్యేక వ్లాగ్ చిత్రీకరించారు. ఇందులో భాగంగా ఆమె ఇంటికి ఫరా ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ధనశ్రీ ఇంటి అలంకరణ, బాల్కనీలోని పచ్చదనం, ఆమె అమ్మమ్మ గీసిన అందమైన పెయింటింగ్స్ను ఫరా ఎంతగానో మెచ్చుకున్నారు. ఈ సరదా సంభాషణలోనే ధనశ్రీ తన పాత రోజులను గుర్తుచేసుకున్నారు. తాను వినోద రంగంలోకి రాకముందు మూడేళ్ల పాటు దంతవైద్యురాలిగా ప్రాక్టీస్ చేశానని తెలిపారు. ముంబైలోని బాంద్రా, లోఖండ్వాలా ప్రాంతాల్లోని క్లినిక్లలో పనిచేసినట్లు చెప్పారు. ఆ సమయంలో చాలా మంది టీవీ ప్రముఖులతో పాటు, స్టార్ హీరో రణ్బీర్ కపూర్కు కూడా డెంటల్ ట్రీట్మెంట్ ఇచ్చానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఈ విషయం వినగానే ఫరా ఖాన్ తనదైన శైలిలో చమత్కరించారు. “అవునా! నువ్వు రణ్బీర్ నోటి లోపలికి చూశావా? ఎలా ఉంది? ఏమైనా ప్రత్యేకంగా అనిపించిందా?” అంటూ సరదాగా ప్రశ్నించారు. ఫరా అడిగిన ప్రశ్నకు ధనశ్రీ నవ్వుతూ సమాధానమిచ్చారు. “అది నా వృత్తిలో భాగం కదా. అతని నోటి ఆరోగ్యం చాలా బాగుంది. ఆయన చాలా శుభ్రంగా ఉంటారు” అని వృత్తిపరమైన సమాధానం ఇచ్చారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.