రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి ఏడాది పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరంగా వేసిన అడుగులు.. తీసుకున్న నిర్ణయాలు ఆసక్తిగా ఉంటాయి. ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు తన విజన్ను మరోసారి నిలబెట్టుకున్నారు. గతంలో తనకు ఉన్న ఇమేజ్.. తర్వాత కాలంలో నిలబెట్టుకున్నారు. అయితే.. 2024 ఎన్నికల సమయానికి ప్రజలు సంక్షేమకార్యక్రమాలపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ హయాంలో ఇచ్చిన పథకాలతో ప్రజలు దాదాపు వాటిపై ఆశలు పెట్టుకున్నారు. దీంతో చంద్రబాబు కూడా వాటినే తనకు నిచ్చెనగా మార్చుకోవాల్సి వచ్చింది.
దీంతో చంద్రబాబులో ఉన్న ‘విజన్’ నాయకుడిపై సర్వత్రా సందేహాలు వచ్చాయి. అయితే.. చంద్రబాబు ఈవిషయంలో తనను తాను మలుచుకున్నారు. సంక్షేమం-అభివృద్ధి పాలనకు విజన్ను జోడించారు. దీంతో ఏడాది పాలనలో విజన్కు కూడా సమతూకమైన స్థానం.. వేదిక దక్కింది. ముఖ్యంగా మూడు అంశాల్లో చంద్రబాబు దూకుడుగా విజన్ను తిరిగి ప్రారంభించారనే చెప్పాలి. 1) వాట్సాప్ గవర్నెన్స్.. దీని ద్వారా 300 సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రజలు కార్యాలయాలకు రాకుండా..త మ చేతిలోని ఫోన్లోనే ఈ సేవలను పొందేలా వీలు కల్పించారు. ప్రస్తుతం ఇది గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే కొంత చేరువ కాకపోయినా.. ఇతర ప్రాంతాల్లో అమలవుతోంది.
2) ఐటీకి పెద్దపీట.. ఈ విధానంలో విశాఖపట్నాన్ని ఐటీ రాజధానిగా మార్చేందుకు టాటా సన్స్ సహా.. మైక్రోసాఫ్ట్ దిగ్గజం.. బిల్ గేట్స్తో ఒప్పందాలు చేసుకున్నారు. అమరావతిలోనూ బిల్ గేట్స్ సంస్థను తీసుకువచ్చేలా చూస్తున్నారు. ప్రధానంగా క్లౌడ్ కంప్యూటింగ్కు ప్రాధాన్యం ఇస్తున్నారు. తద్వారా ఐటీ నిపుణులను రాష్ట్రంలోనే తయారు చేసేలా.. ఇతర ప్రాంతాలకు చెందిన వారికి కూడా ఇక్కడ ఉపాధి లభించేలా చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అలాగే..ఏఐ కి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీని స్థాపించేలా చర్యలు తీసుకుంటున్నారు.
3) క్వాంటం కంప్యూటింగ్… ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కూడా క్వాంటం కంప్యూటింగ్కు ప్రాధాన్యం పెరుగుతోంది. దీనినిఏపీలోనే అది కూడా అమరావతిలోనే ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది వస్తే.. ప్రపంచదేశాలు సైతం అమరావతివైపు చూడడం ఖాయమని విశ్వసిస్తున్నారు. అదేవిధంగా 10 వ తరగతి నుంచే ఏఐ సబ్జెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటిని కూడా పాఠ్యాంశంగా బోధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే.. ఏఐ ద్వారా పాలన సాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా.. చంద్రబాబు ఈ ఏడాది కాలంలో తన విజన్ను పాలనకు జోడించడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
ఏపీ సీఎం చంద్రబాబు ప్లాన్ వేస్తే.. సక్సెస్ కాకుండా పోతుందా? పైగా ఆయన విజన్ ఉన్న నాయకుడిగా కూడా పేరు తెచ్చుకు న్నారు. ఈ నేపథ్యంలో ఆయన వేసే వ్యూహాలు.. పెట్టుకునే లక్ష్యాలకు కూడా సాధించడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. తాజాగా విజన్ -2047తోపాటు.. విజన్ ఫర్ కాన్సిట్యుయెన్సీ పేరుతో చంద్రబాబు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిని జూన్ 12 నుంచి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం కింద.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక విజన్గా భావిస్తారు. ప్రతి నియోజకవర్గంలోనూ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీనికి గాను 10 లక్షల రూపాయలను కేటాయిస్తారు.
ఈ పది లక్షల రూపాయలతో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారు. దీనికి ఎమ్మెల్యేనే చైర్మన్గా, సారథిగా కూడా ఉంటారు. దీనికి స్థానికంగా ఉన్న నాయకులను కూడా జత చేసుకుని నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తారు. ఈ విజన్ ద్వారా నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంతోపాటు.. విజన్-2047 లక్ష్యం రాష్ట్రానికైతే.. విజన్ -నియోజకవర్గం లక్ష్యం.. నియోజకవర్గానికి సంబంధించి ఉంటుంది. తద్వారా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు కూడా అభివృద్ధిని పరిచయం చేయనున్నారు. దీనిని సమగ్రంగా అమలు చేసేలా చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించనున్నారు.
విజన్-నియోజకవర్గంలో భాగంగా.. ఆయా నియోజకవర్గాల తీరు తెన్నులను తెలుసుకుంటారు. వ్యవసాయ సంబంధమైన నియోజకవర్గం అయితే.. ఆతరహా విధానాలను డెవలప్ చేస్తారు. అలా కాకుండా.. ఇతర ప్రాధాన్యాలు ఉంటే.. వాటికి ప్రాధాన్యం ఇస్తారు. ఉదాహరణకు తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాలు వ్యవసాయ సంబంధమైన జిల్లాలు. దీంతో ఇక్కడి నియోజకవర్గాల్లో రైతులకు ప్రధానంగా ప్రోత్సాహం అందించి..త ద్వారా నియోజకవర్గాల్లో అభివృద్ధిని సాధించే కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అదేసమయంలో మహిళా సాధికారతకు కూడా నియోజకవర్గాల స్థాయిలోనే ప్రాధాన్యం పెంచనున్నారు.
ఇక, వ్యవసాయేతర నియోజకవర్గాలైన కర్నూలు, కడప, అనంతపురం వంటి జిల్లాల్లో ప్రతినియోజకవర్గంలో స్థానికంగా ఉత్ప త్తులను ప్రోత్సహించనున్నారు. అదేవిధంగా పునరుత్పాదక ఇంధన వనరులకు ప్రోత్సహిస్తారు. తద్వారా.. నియోజకవర్గంలోనే స్వయంగా ఆదాయం సంపాయించుకునే మార్గాలను అన్వేషించనున్నారు. ఇలా.. ఒక్కొక్క నియోజకవర్గాన్ని వచ్చే రెండేళ్లలోనే అద్భుతంగా తయారు చేయాలన్నది సీఎం లక్ష్యం. ఇక, ఉమ్మడిగా అన్ని నియోజకవర్గాలకు కలిపి విద్య, వైద్యం, ఇతర మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తారు. దీనికి ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నారు. ఇలా.. రాష్ట్ర స్థాయిలో నే కాకుండా.. నియోజకవర్గ స్థాయిలోనూ విజన్ను పరిచయం చేయాలన్నది చంద్రబాబు లక్ష్యం.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయింది. ఈ క్రమంలో చంద్రబాబు ప్రజలకు `తల్లికి వందనం` పేరుతో గిఫ్టు ప్రక టించారు. ఇది సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైంది. ఇదిలావుంటే.. టీడీపీకి చెందిన మంత్రులు కూడా చంద్రబాబు పెద్ద ఎత్తున గిఫ్టులు ఇచ్చారు. అయితే.. ఇవి అలాంటి ఇలాంటి గిఫ్టులు కావు. చంద్రబాబు కూడా.. సాధారణ గిఫ్టులు ఇచ్చేస్తే సంతసించే టైపు కూడా కాదు. ఆయన పనిరాక్షసుడనే పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబును మెప్పించాలన్నా.. మంత్రులు ఒప్పించాలన్నా.. ఆయనకు ఆయన శైలిలోనే గిఫ్టులు ఇవ్వాలి.
మంత్రులు తాజాగా ఈ గిఫ్టులనే ఇచ్చారు. గత ఏడాది కాలంగా.. మంత్రులు తమ తమ శాఖల ద్వారా చేసిన పనులను ఓ నివేదిక రూపంలో గుదిగుచ్చి.. చంద్రబాబుకు కానుకగా ఇచ్చారు. “ఏడాది కాలంలో మీరు చూపిన బాటలో నడిచాం. మీ ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా పనిచేశాం. ఇదీ..మేం చేసిన పనులు“ అంటూ.. మంత్రులు తమ తమ నివేదికలను సీఎంవోకు అందించారు. తద్వారా చంద్రబాబు మనసు చూరగొనే ప్రయత్నాలు చేశారు. సహజంగానే చంద్రబాబు తాను పనిచేస్తూ.. తన తోటివారిని కూడా రుద్దుతారన్న పేరుంది. వారిలో అధికారులు కూడా ఉంటారు.
ఇక, తాజాగా ఏర్పడి 4.0 ప్రభుత్వంపై ప్రజలకు చాలానే ఆశలు ఉన్నాయి. దీంతో మరింతగా ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం ఉందనేది సీఎంగా చంద్రబాబు పదే పదే చెబుతున్న మాట. అంతేకాదు.. ఏమాత్రం లైట్ తీసుకున్నా.. ప్రజలు కనిపెడుతూనే ఉంటారని.. తరచుగా ఆయన మంత్రులకు చెబుతున్నారు. కొన్నాళ్ల కిందట మంత్రుల గ్రాఫ్ను కూడా ఆయన వివరించారు. ఈ నేపథ్యంలోనే మంత్రులు తమ తమ శాఖలకు సంబంధించి ఏడాది కాలంలో చేపట్టిన పనులను, ప్రభుత్వం ద్వారా తీసుకున్న నిధులను వాటిని ఏయే కార్యక్రమాలకు ఎలా పంపిణీ చేసింది సమగ్రంగా వివరిస్తూ.. పీడీఎఫ్లు, హార్డ్ కాపీల రూపంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు.
దీనిపై శ్రీకాకుళానికి చెందిన మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. “ఏడాది పాలనలో ఎన్నోచేశాం. అయితే.. మాది మాటల ప్రభుత్వం కాదు. చేతల ప్రభుత్వం అందుకే నివేదికల రూపంలో సీఎంకు పంపించాం. మా ముఖ్యమంత్రి మాటలకు సంతృప్తి పడే వ్యక్తికాదు. ఆయన పనిచేస్తూ.. మాతో చేయిస్తున్నారు. అందుకే.. ఏడాది కాలంలో మేం ఏచేశామన్నది.. ఆయనకు నివేదికలరూపంలో ఇచ్చాం. దీనిని ప్రభుత్వ వార్షికోత్సవ గిఫ్టుగా మా మిత్రులు చెబుతున్నారు“ అని వ్యాఖ్యానించారు. మరి దీనిపై చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.