ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Amaravati:మూడేళ్ల‌లో రాజ‌ధాని నిర్మాణం పూర్తి : మంత్రి నారాయణ

Amaravati:మూడేళ్ల‌లో రాజ‌ధాని నిర్మాణం పూర్తి : మంత్రి నారాయణ
ADVERTISEMENT

రాజ‌ధాని నిర్మాణానికి దాదాపు రూ.64వేల కోట్లు ఖర్చవుతుందని మంత్రి నారాయణ ఏపీ అసెంబ్లీలో ప్రకటించారు. రాజధాని నిర్మాణం కోసం బ‌హుళ ప‌క్ష ఏజెన్సీలు, భూములు అమ్మ‌డం,లీజుల ద్వారా నిధులు సేక‌రిస్తామ‌న్నారు. అసెంబ్లీలో ప్ర‌శ్నోత్త‌రాల్లో బీజేపీ ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి అడిగిన ప్ర‌శ్న‌కు మంత్రి నారాయ‌ణ స‌మాధాన‌మిచ్చారు.
అమ‌రావ‌తి గ‌వ‌ర్న‌మెంట్ కాంప్లెక్స్(ఏజీసీ)లో ఇళ్లు,భ‌వ‌న నిర్మాణాలు,ట్రంక్ ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్, ఎల్పీఎస్ మౌళిక స‌దుపాయాల అభివృద్ది కోసం 64,721.48 కోట్లు ఖ‌ర్చ‌వుతుందని వివరించారు. .ఈ నిధుల‌ను వివిధ రూపాల్లో సేక‌రించి అమ‌రావ‌తి నిర్మాణం చేప‌డుతున్నామని చెప్పారు.

బ‌హుళ ప‌క్ష ఏజెన్సీలు, బ్యాంకుల నుండి లోన్ లు,కేంద్ర ప్ర‌భుత్వం నుండి గ్రాంటుల‌ను పొందడం ద్వారా అమరావతికి నిధుల సేకరిస్తున్నామని చెప్పారు. రైతుల‌కు అభివృద్ది చేసిన ప్లాట్ల‌ను ద‌శ‌ల వారీగా మూడేళ్ల‌లో అప్ప‌గించేందుకు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉందన్నారు.

2019-24 మ‌ధ్య విధాన‌ప‌ర‌మైన అనిశ్చితుల కార‌ణంగా ఈ ప్ర‌క్రియ‌లో జాప్యం జ‌రిగిందన్నారు.ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు గారి మీద‌ న‌మ్మ‌కంతో 58 రోజుల్లోనే 34 వేల ఎక‌రాలు రైతులు ప్ర‌భుత్వానికి ఇచ్చారని…ప్ర‌పంచంలోనే టాప్ 5 రాజ‌ధానిగా అమ‌రావ‌తి ఉండాల‌ని ముఖ్య‌మంత్రి గారు ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసార‌ని చెప్పారు.

రాజ‌ధాని నిర్మాణానికి అయ్యే ఖ‌ర్చులో ప్ర‌పంచ బ్యాంకు,ఏడీబీ క‌లిసి 13,400 కోట్లు రుణం ఇస్తున్నాయ‌ని చెప్పారు. KFW బ్యాంకు 5 వేల కోట్లు లోన్ ఇస్తుందని, హ‌డ్కో నుంచి 11000 కోట్లు రుణం రెండు మూడు రోజుల్లో వ‌స్తుందని చెప్పారు.

కేంద్రం గ్రాంట్ కింద మ‌రో 1560 కోట్లు ఇస్తుందని అమ‌రావ‌తి లోప‌ల భూములు అమ్మ‌డం,లీజు ద్వారా అలాగే జాతీయ,అంత‌ర్జాతీయ మార్కెట్ లో త‌క్కువ వ‌డ్డీకి లోన్ తీసుకోవ‌డం ద్వారా మిగిలిన నిధులు స‌మీక‌రిస్తామ‌ని మంత్రి నారాయ‌ణ అసెంబ్లీలో తెలిపారు.

అమ‌రావ‌తిలో 106 ప్ర‌భుత్వ‌,ప్ర‌భుత్వేత‌ర‌ రంగ సంస్థ‌లు త‌మ కార్యాల‌యాలు ఏర్పాటుచేసేందుకు సిద్దంగా ఉన్నాయన్నారు. టెండ‌ర్ల ప్ర‌క్రియ పూర్త‌యి ప‌నులు ప్రారంభించేందుకు లెట‌ర్ ఆఫ్ అగ్రిమెంట్ లు ఇచ్చేందుకు అథారిటీ అనుమ‌తి తీసుకుంటున్న‌ట్లు మంత్రి నారాయ‌ణ చెప్పారు.

అమ‌రావ‌తిలో ట్రంక్ రోడ్లు(మెయిన్ రోడ్లు) 165 అడుగులు,185 అడుగుల‌తో రెండేళ్ల‌లో పూర్తి చేస్తామని చెప్పారు. ఎల్పీఎస్ రోడ్లు మూడేళ్ల‌లో పూర్తి చేస్తామని స‌గానికి పైగా నిర్మాణం జ‌రిగిన అధికారుల భ‌వ‌నాలు ఏడాదిన్న‌ర‌లో…మిగ‌తావి రెండేళ్లు,అసెంబ్లీ,సెక్ర‌టేరియ‌ట్,హైకోర్టు నిర్మాణాల‌ను మూడేళ్ల‌లో పూర్తి చేస్తామ‌ని మంత్రి నారాయ‌ణ చెప్పారు.

2014-19 మ‌ధ్య‌లో అమ‌రావ‌తిలో 131 సంస్థ‌ల‌కు 1277 ఎక‌రాలు కేటాయించగా….గ‌త ఐదేళ్ల‌లో జ‌రిగిన ప‌రిణామాల‌తో కొన్ని సంస్థ‌లు వెన‌క్కి వెళ్లిపోయాయని అన్నారు.గ‌తంలో కేటాయించిన మొత్తం 31 సంస్థ‌ల‌కు 629.3 ఎక‌రాలు కొన‌సాగిస్తుండ‌గా, రెండు సంస్థ‌ల‌కు 5.5 ఎకరాలు వేరొక ప్రాంతాల్లో కేటాయిస్తున్నామ‌న్నారు.మ‌రో 16 సంస్థ‌ల‌కు గ‌తంలో చేసిన కేటాయింపుల్లో మార్పులు చేయ‌డంతో పాటు వేరొక చోట‌ 48.74 ఎక‌రాలు కేటాయించామ‌న్నారు.

మ‌రోవైపు 13 సంస్థ‌ల‌కు 177.24 ఎక‌రాలు గ‌తంలో చేసిన కేటాయింపులు ర‌ద్దు చేస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. మొత్తంగా 683.6 ఎక‌రాలను వివిధ సంస్థ‌ల‌కు కేటాయిస్తూ ఈనెల 10న జ‌రిగిన కేబినెట్ స‌బ్ క‌మిటీ భేటీలో నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్పారు.

అమ‌రావ‌తి నిర్మాణానికి 30 వేల ఎక‌రాలు కావాల‌ని జ‌గ‌న్ గారు ఇదే అసెంబ్లీ సాక్షిగా చెప్పారని ప్ర‌భుత్వం మార‌గానే ప్లేటు ఫిరాయించి మూడు ముక్క‌లాట ఆడి ఎక్క‌డా రాజ‌ధాని చేయ‌లేదన్నారు.గ‌త ఐదేళ్ల‌లో రాజ‌ధాని కి భూములిచ్చిన రైతులను నానా ఇబ్బందులు పెట్టారని శాడిజంతో క‌క్ష సాధింపుతో ఆర్ – 5 జోన్ చేసి 50 వేల మందికి ఒక సెంట్ భూమి ఇచ్చారని వారికి కూడా ప్ర‌త్యామ్నాయాలు ఆలోచిస్తున్నామని చెప్పారు.వేరొక చోట స్థ‌లం కేటాయించి అమ‌రావ‌తి భూముల‌ను రాజ‌ధాని కోసం తీసుకుంటామ‌న్నారు.

Tags: #Amaravati#AndhraPradesh#APCapital#CapitalConstruction#Development
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

SLBC Tunnel : రోబోతో రెస్క్యూ ఆపరేషన్‌

Next Post

Hyderabad : హబ్సిగూడలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య!

Related Posts

HandriNeeva: కర్నూలులో మంత్రి నిమ్మల రామానాయుడు హంద్రీనీవా ప్రాజెక్ట్ సమీక్ష
Andhra Pradesh

HandriNeeva: కర్నూలులో మంత్రి నిమ్మల రామానాయుడు హంద్రీనీవా ప్రాజెక్ట్ సమీక్ష

Fake Liquor Scam: నకిలీ కుట్ర!
Andhra Pradesh

Fake Liquor Scam: నకిలీ కుట్ర!

Priyanka Chopra: సరికొత్తగా గ్లోబల్ స్టార్
Entertainment

Priyanka Chopra: సరికొత్తగా గ్లోబల్ స్టార్

Pm Modi: మోడీ మౌనం వెనుక..?
Big Story

Pm Modi: మోడీ మౌనం వెనుక..?

Amaravati: ఆ సత్తా మాకు వుంది
Andhra Pradesh

Amaravati: ప‌క్కాప్లాన్‌..!

Nara Lokesh: రోల్ మోడల్ గా
Andhra Pradesh

Andhra Pradesh: మాస్టర్ ప్లాన్..లోకేష్ చెక్..!

Next Post
Hyderabad : హబ్సిగూడలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య!

Hyderabad : హబ్సిగూడలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

HandriNeeva: కర్నూలులో మంత్రి నిమ్మల రామానాయుడు హంద్రీనీవా ప్రాజెక్ట్ సమీక్ష

HandriNeeva: కర్నూలులో మంత్రి నిమ్మల రామానాయుడు హంద్రీనీవా ప్రాజెక్ట్ సమీక్ష

Fake Liquor Scam: నకిలీ కుట్ర!

Fake Liquor Scam: నకిలీ కుట్ర!

Priyanka Chopra: సరికొత్తగా గ్లోబల్ స్టార్

Priyanka Chopra: సరికొత్తగా గ్లోబల్ స్టార్

Pm Modi: మోడీ మౌనం వెనుక..?

Pm Modi: మోడీ మౌనం వెనుక..?

Recent News

HandriNeeva: కర్నూలులో మంత్రి నిమ్మల రామానాయుడు హంద్రీనీవా ప్రాజెక్ట్ సమీక్ష

HandriNeeva: కర్నూలులో మంత్రి నిమ్మల రామానాయుడు హంద్రీనీవా ప్రాజెక్ట్ సమీక్ష

Fake Liquor Scam: నకిలీ కుట్ర!

Fake Liquor Scam: నకిలీ కుట్ర!

Priyanka Chopra: సరికొత్తగా గ్లోబల్ స్టార్

Priyanka Chopra: సరికొత్తగా గ్లోబల్ స్టార్

Pm Modi: మోడీ మౌనం వెనుక..?

Pm Modi: మోడీ మౌనం వెనుక..?

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info