తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తిరుగులేని మార్కెట్తో పాటు పాపులారిటీని సొంతం చేసుకున్న హీరో ధనుష్. కెరీర్ ప్రారంభం నుంచి వైవిద్యానికే పెద్ద పీట వేస్తూ వచ్చిన ధనుష్ నిత్యం బిజీగా ఉంటూ తనదైన మార్కు సినిమాతో మూడు భాషల్లో సత్తా చాటుతున్నాడు. హీరోగా వరుస విజయాల్ని సొంతం చేసుకుంటూనే దర్శకుడిగా, నిర్మాతగానూ తన టాలెంట్ చూపిస్తున్నారు. ఇటీవల రాయన్, జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాలతో దర్శకుడిగానూ సత్తా చాటిన ధనుష్ ఇప్పడు హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇండియాలోనే అత్యంత బిజీ స్టార్గా నిలిచాడు.
‘సార్’ సూపర్ హిట్ తరువాత ధనుష్ తెలుగులో చేస్తున్న మూవీ ‘కుబేర’. శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ భారీ స్థాయిలో జూన్ 20న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాతో పాటు ధనుష్ మొత్తం పది ప్రాజెక్ట్లలో నటిస్తూ సహచర స్టార్లని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇతర స్టార్లు ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే ఇబ్బందులు పడుతుంటే ధనుష్ ఏకంగా పది ప్రాజెక్ట్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా అందులో నెండు బయోపిక్లు కూడా ఉండటం విశేషం.
అంతే కాకుండా ఈ పది సినిమాల్లో ధనుష్ హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇలా త్రిపాత్రాభినయం చేస్తూ ‘ఇడ్లీ కడాయ్’ మూవీని చేస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 1న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. వీటితో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్లు ధనుష్ లైనప్లో ఉన్నాయి. శేఖర్ కమ్ముల ‘కుబేర’తో పాటు ధనుష్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్లు ఇవి. హిందీలో ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కిస్తున్న ‘తేరే ఇష్క్ మే’ ఒకటి. చాలా రోజుల తరువాత ధనుష్ మరోసారి ఈ డైరెక్టర్తో చేస్తున్న సినిమా ఇది.
వీటితో పాటు ఇప్పటికే చెప్పుకున్న ‘ఇడ్లీ కడాయ్’, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా బయోపిక్` ఉంది. దీనికి అరున్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక మరో క్రేజీ ప్రాజెక్ట్ అబ్దుల్ కలామ్ బయోపిక్ని ‘కలామ్’ పేరుతో ధనుష్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఓమ్ రౌత్ దర్శకుడు. ఇదే వరుసలో రాజ్ కుమార్ పెరియసామీతో ఓ సినిమా, విఘ్నేష్ రాజాతో ఓ ప్రాజెక్ట్, వెట్రిమారన్తో ఓ మూవీ, తమిళరసన్తో, మారి సెల్వరాజ్ సినిమాలు చేస్తున్నాడు. ఇలా ఈ స్థాయిలో పది ప్రాజెక్ట్లు చేస్తున్న ఇండియన్ హీరోగా ధనుష్ నిలిచాడు.