ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Cm ChandraBabu: స్మూత్ గవర్నెన్స్‌

Cm ChandraBabu: స్మూత్ గవర్నెన్స్‌
ADVERTISEMENT

అధికారంలో ఉన్న వారు.. ప్ర‌జ‌ల‌ను పాలించ‌డ‌మంటే.. వారిపై పెత్త‌నం చేయ‌డం కాదు. ప్రజల మనసు తెలుసుకొని దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవటం స్మూత్ గవర్నెన్స్ లో కీలకం. ఈ విషయంలో చాలామంది ముఖ్యమంత్రులు విఫలమవుతున్నారు. తాము తీసుకున్న నిర్ణయాలే ఫైనల్, అదే అమలు జరగాలి అన్న ఆలోచనతో కొందరు వ్య‌వ‌హ‌రించి.. అభాసుపాలైన విషయం తెలిసిందే. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను తీసుకున్న మూడు రాజధానులు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాజధాని రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినా ఆయ‌న వెన‌క్కి త‌గ్గ‌లేదు.

అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా తమ స్థలాలకు సంబంధించిన పట్టాలపై జగన్ ఫోటోలు వేయడాన్ని చాలామంది నిరసించారు. ఏకంగా జగన్ సతీమణి భారతిని ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా, జగన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తాను తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అంటూ మొండిగా ముందుకు సాగారు. ఇది ఎన్నికల సమయంలో తీవ్ర ఇబ్బంది కలిగించింది. ఇక‌, ఎంతో సీనియర్ పొలిటీషియ‌న్‌, దేశంలోనే ప్రస్తుతం ఉన్న నాయకుల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు సీఎం చంద్రబాబు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

తను తీసుకున్న నిర్ణయం అమలు చేయాలని ఆయనకి ఉన్నప్పటికీ ప్రజల నుంచి ఏమాత్రం నిరసన వ్యక్తమైనా, సదరు నిర్ణయాన్ని ప్రజలు హర్షించకపోయినా ఆయన వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నారు. ఎక్కడ భేషజాలకు పోకుండా సదరు నిర్ణయంలో తప్పులు ఉంటే కచ్చితంగా దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇది జనం మనసును ఆకట్టుకుంటోంది. ఒకరకంగా చెప్పాలంటే జనం గుండెల్ని చంద్రబాబు జ్యూస్ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. తాజాగా అనర్హులకు పింఛన్లు ఇస్తున్నారన్న కారణంతో ఓ అధికారి ఇచ్చిన సలహా మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు అదేవిధంగా వృద్ధుల పింఛన్లను చాలామందిని తొలగించారు. ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. నిరసనలు కూడా తెరమీదకు వచ్చాయి. దీంతో స్పందించిన చంద్రబాబు అసలు ఇట్లాంటి సలహా ఇచ్చిన అధికారి ఎవరు అని ఆరా తీసి ఆయనకు అక్షింతలు వేయడంతో పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించాలని అధికారులను ఆదేశించారు.

దీంతో రాష్ట్రంలో తలెత్తిన సమస్య పోయింది. వచ్చే నెల నుంచి అందరికీ పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక రెండో కీలక నిర్ణయం.. కరెంటు చార్జీలు. ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తం అయింది. జగన్ హయాంలో భారీ ఎత్తున కరెంటు చార్జీలు పెరిగిపోయాయని భరించలేకపోతున్నామని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే బాటలో నడిస్తే ఎలా అంటూ చాలా చోట్ల ప్రజలు విమర్శలు గుప్పించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు అవసరమైతే ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇవ్వడంతో ప్రజలకు ఊరట కలిగింది.

ఇక సూపర్ సిక్స్ లో కీలకమైన ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం విషయంలో కూడా ప్రజల మనసును గుర్తుపెట్టుకుని ప్రజలు కోరుకుంటున్నా విధంగా ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. వాస్తవానికి మొదట్లో కేవలం మండలాలకి లేదా జిల్లాలకు మాత్రమే ఉచిత బస్సులు పరిమితం చేయాలని ప్రభుత్వం భావించింది. ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నారు. కానీ, ప్రజల నుంచి దీనిపై విమర్శలు వచ్చాయి. ఉచిత హామీ ఇచ్చినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్లు తెర‌మీదకు వచ్చాయి. దీన్ని పరిశీలించిన చంద్రబాబు ఎంత ఖర్చు అయినా వెనకాడాల్సిన అవసరం లేదని సంపద వేరే రూపంలో సృష్టిస్తామని పేర్కొంటూ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఇది అమలు అవుతుంది కూడా. ఇలా చంద్రబాబు ప్రజల మనసును తెలుసుకొని స్మూత్ గవర్నెన్స్‌లో నెంబర్ వన్ సీఎంగా నిలబడుతున్నారనేది పార్టీ నాయకులు చెబుతున్న మాట.

Tags: #AndhraPradesh#AndhraPradeshPolitics#APGovernance#ChandrababuNaidu#cmchandrababu#PeopleFirst
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Pawan Kalyan: రుషికొండ భవనాలకు మోక్షం

Next Post

Pawan Kalyan: పవర్ ఫుల్ గా

Related Posts

SouthActress
Entertainment

SouthActress:నారింజ రంగు చీరలో మెరిసిన అతుల్య రవి – ఈ స్టిల్స్‌లో అదిరిపోయే అందం

APPolitics
Big Story

APPolitics:జగన్ ఫోటోల పిచ్చి కోసం రూ.750 కోట్లు ఖర్చు చేశారా? – డోన్ సభలో సీఎం చంద్రబాబు విమర్శలు

RevanthReddy
Big Story

RevanthReddy:మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిని అడ్డుకోవద్దు – సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

GlobalEconomy
Big Story

GlobalEconomy:శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు – అర్ధరాత్రి నుంచే అమలు, పాకిస్థాన్‌లో కూడా ఇంధన ధరల షాక్

CrimeNews
Big Story

CrimeNews:విజయవాడలో డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసు మిస్టరీ వీడింది – ప్రియుడు డాక్టర్ అమర్ అరెస్ట్, 14 రోజులు రిమాండ్

InternationalWomensDay
Andhra Pradesh

InternationalWomensDay:అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా

Next Post
Pawan Kalyan: పవర్ ఫుల్ గా

Pawan Kalyan: పవర్ ఫుల్ గా

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

SouthActress

SouthActress:నారింజ రంగు చీరలో మెరిసిన అతుల్య రవి – ఈ స్టిల్స్‌లో అదిరిపోయే అందం

APPolitics

APPolitics:జగన్ ఫోటోల పిచ్చి కోసం రూ.750 కోట్లు ఖర్చు చేశారా? – డోన్ సభలో సీఎం చంద్రబాబు విమర్శలు

RevanthReddy

RevanthReddy:మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిని అడ్డుకోవద్దు – సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

GlobalEconomy

GlobalEconomy:శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు – అర్ధరాత్రి నుంచే అమలు, పాకిస్థాన్‌లో కూడా ఇంధన ధరల షాక్

Recent News

SouthActress

SouthActress:నారింజ రంగు చీరలో మెరిసిన అతుల్య రవి – ఈ స్టిల్స్‌లో అదిరిపోయే అందం

APPolitics

APPolitics:జగన్ ఫోటోల పిచ్చి కోసం రూ.750 కోట్లు ఖర్చు చేశారా? – డోన్ సభలో సీఎం చంద్రబాబు విమర్శలు

RevanthReddy

RevanthReddy:మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిని అడ్డుకోవద్దు – సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

GlobalEconomy

GlobalEconomy:శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు – అర్ధరాత్రి నుంచే అమలు, పాకిస్థాన్‌లో కూడా ఇంధన ధరల షాక్

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info