ఏపీలో మంత్రివర్గ సమావేశం ఈ నెల 20న జరగనుంది. ఈ సమావేశం అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక ప్రతీ నెలా రెండు సార్లు మంత్రివర్గ సమావేశాలను నిర్వహిస్తోంది. ప్రతీ పదిహేను రోజులకు ఒకసారి మంత్రివర్గ సమావేశం జరగడంతో పాలనాపరంగా వేగం పెరిగింది.
ప్రజలకు సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు అంతే కాదు ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలన్నది కూడా సరైన విధానంలో తీసుకుని అమలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ నెలలో రెండో మంత్రివర్గ సమావేశం ఈ నెల 20న జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరిగే తొలి ఏడాదిలో ముగింపు సమావేశంలో కీలకమైనదిగా భావిస్తున్నారు. దాంతో బాబు నాయకత్వంలో జరిగే కేబినెట్ మీటింగ్ మీద ఆసక్తి పెరిగింది. అందరి చూపూ ఈ సమావేశం మీద ఉంది.
ఇక ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వం తొలి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టాలి అన్నది చర్చిస్తుంది. అలాగే కొన్ని కొత్త కార్యక్రమాలను కూడా అమలు చేసేందుకు ఆమోదముద్ర వేస్తుంది. ఇక తొలి ఏడాదిలో సంక్షేమం అభివృద్ధి రెండూ సమాన ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగిన నేపధ్యం ఉంది. అయితే సూపర్ సిక్స్ హామీలలో కొన్ని ఇంకా నెరవేర్చాల్సి ఉంది. దాంతో వాటి పైనే కేబినెట్ మీటింగ్ లో ఫోకస్ పెడతారు అని అంటున్నారు.
తల్లికి వందనం, రైతులకు అన్నదాత సుఖీభవ వంటివి అమలు చేయనున్నారు. అదే విధంగా ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్న ఉచిత బస్సు ప్రయాణం గురించి చర్చిస్తారు అని అంటున్నారు. అదే విధంగా ఏపీలో కొత్తగా ఏ కార్యక్రమాలను చేపట్టవచ్చు అన్నది కూడా ఈ సమావేశం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది అని అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధితో పాటు ఏమేమి ఇంకా చేయాల్సి ఉంది అన్నది కూడా కూలంకషంగా చర్చిస్తారు అని అంటున్నారు. అన్ని వర్గాలకు చేరువ కావాలన్న కూటమి ప్రభుత్వం ఆలోచనలు ఎంతమేరకు నెరవేరాయి అన్నది కూడా చూస్తారని అంటున్నారు. శాఖల వారీగా జరిగిన ప్రగతి నివేదికలను కూడా చూసుకుంటూ కూటమి ప్రభుత్వం రెండవ ఏడాదిలోకి ప్రవేశిస్తున్న వేళ ఏ రకమైన పనితీరుని కనబరచాలి అన్న దాని మీద మంత్రులకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేస్తారు అని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు నాయకత్వంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో సంచలన నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో చూడాలి..!