స్వీటీ అనుష్క సినిమాలకు గ్యాప్ ఇవ్వడం వల్ల ఆమె ఫ్యాన్స్ అంతా కూడా ఆమెను ఎంతో మిస్ అయ్యారు. నిశ్శబ్ధం తర్వాత కెరీర్ లో కూడా సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చిన అనుష్క 3 ఏళ్ల గ్యాప్ తర్వాత నవీన్ పొలిశెట్టితో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చేసింది. ఆ సినిమాలో అనుష్కని చూసి తెలుగు ఆడియన్స్ ఖుషి అయ్యారు. ఇక ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ కాబట్టి స్వీటీ ఫ్యాన్స్ అయితే ఆమెను చూసేందుకే రిపీటెడ్ గా సినిమాకు వెళ్లారు. ఐతే ఆ సినిమా తర్వాత మళ్లీ కథల ఎంపికలో లేట్ చేసింది అనుష్క.
ఫైనల్ గా క్రిష్ డైరెక్షన్ లో ఘాటితో రాబోతుంది. ఈ సినిమా ఈపాటికి రిలీజ్ అవ్వాల్సింది కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాలేదని వాయిదా వేశారు. అనుష్క ఘాటి రిలీజ్ ఎప్పుడు అన్నది క్లారిటీ రాలేదు. క్రిష్ కూడా ఘాటి విషయం లో సైలెంట్ గా ఉంటున్నాడు. ఇదిలా ఉంటే తనపై ఫ్యాన్స్ చూపిస్తున్న ఈ ప్రేమని దృష్టిలో ఉంచుకుని అనుష్క ఒక క్రేజీ డెసిషన్ తీసుకుందని తెలుస్తుంది. ఇక మీదట కెరీర్ లో గ్యాప్ తీసుకోకూడదని అనుష్క నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. అంతేకాదు ఒకప్పటిలా కమర్షియల్ సినిమాల్లో కూడా ఆమె నటించాలని అనుకుంటుందట. అనుష్క కమర్షియల్ సినిమాలు చేయాలని అనుకుంటే మాత్రం ఆమెకు వరుస ఛాన్స్ లు వస్తాయని చెప్పొచ్చు. కమర్షియల్ సినిమాలు చేస్తూనే అనుష్క ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతో స్టార్ ఇమేజ్ సంపాదించింది.
అనుష్క తిరిగి మళ్లీ కమర్షియల్ సినిమాలు చేస్తే మాత్రం మిగతా హీరోయిన్స్ కి గట్టి షాకే తగిలే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. అనుష్క ఘాటి రిలీజ్ తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే మరో సినిమా చేయాలని అనుకుంటుందట. ప్రభాస్ తో మరోసారి అనుష్క జత కడితే చూడాలని ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఐతే ఆ కాంబినేషన్ కుదరలాంటే అలాంటి ఒక కథ సెట్ అవ్వాలి. ప్రభాస్ మాత్రమే కాదు అనుష్క తను చేసిన మిగతా స్టార్స్ అందరితో కలిసి చేస్తే మాత్రం ఆమె ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే అని చెప్పొచ్చు. మరి కెరీర్ పట్ల అనుష్క నిజంగానే సీరియస్ గా ఆలోచిస్తుందా లేదా మళ్లీ గ్యాప్ తీసుకునే ఆలోచనలో ఉందా అన్నది తెలియాల్సి ఉంది. ఘాటి రిలీజ్ ప్రమోషన్స్ టైంలో అనుష్కని ఫ్యాన్స్ కూడా వరుస సినిమాలు చేయాలని రిక్వెస్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు.