AP: ఏపీలో కూటమి నేతల తీరుపై మాజీ వైసీపీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వైయస్ జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇలా కొంతమందిని ఏర్పాటుచేసి నల్ల బ్యాడ్జీలు వేసుకొని వ్యతిరేకత తెలియజేశారు. వాళ్లే రాళ్లు వేసుకొని మా కార్యకర్తలపై నిందలు వేసారని అంబటి రాంబాబు తెలిపారు. ఇక ఇప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాలో పర్యటించబోతున్న నేపథ్యంలో అతని పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు.
పోలీసుల వేదింపులకు ఆత్మహత్యకు పాల్పడ్డ వైసీపీ కార్యకర్త నాగ మల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు. ఆయన పర్యటనకు అనుమతి తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు.. జగన్ ఇంట్లో నుంచి బయటకు వస్తే ఊరుకోం అనేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సొంత పార్టీ కార్యకర్త మరణిస్తే జగన్ పరామర్శించడానికి వస్తున్నారు. ఇక జగన్ వస్తున్నారంటే పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారని ఎక్కడా కూడా మేము లా అండ్ ఆర్డర్ సమస్యలను సృష్టించలేదని తెలిపారు.
జగన్ బయటకు వస్తున్నాడంటే చంద్రబాబు, లోకేష్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు ఒకటే విషయం గుర్తు పెట్టుకోవాలని అధికారం చేతుల్లో ఉంది కదా అని అంత మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సాగదనిఓ పక్క కేసులు పెడతారు.. మాపైనే దాడులు చేస్తారు.. ప్రజాస్వామ్యంలో ఎన్నాళ్లు సాగుతుందో మేము చూస్తామని అన్నారు.ఇప్పటి వరకు చంద్రబాబు వెన్నుపోటు మంచితనాలు చాలా చూశాం.. భయపడితే రాజకీయాలు చేయలేం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.