అహ్మదాబాద్ నుంచి లండన్ గాత్విక్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం గురువారం మధ్యాహ్నం కుప్పకూలింది.ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే, విమానం టేకాఫ్ సమయంలో వింగ్ ఫ్లాప్లు సమస్యగా ఉండొచ్చని విమానయాన నిపుణులు చెప్పారు.వెరిఫై చేసిన ఒక వీడియోలో విమానం దిగుతున్నట్లు, అది నేలను తాకినప్పుడు పెద్ద పేలుడు సంభవించినట్లు చూపిస్తుంది.
విమానయాన నిపుణుడు జెఫ్రీ థామస్ మాట్లాడుతూ “నేను వీడియోను చూసినప్పుడు, చక్రాలు (అండర్ క్యారేజ్) ఇంకా బయట ఉన్నాయి, కానీ ఫ్లాప్లు లోపలికి వెళ్లాయి” అని అన్నారు”చక్రాలు సాధారణంగా 10–15 సెకన్ల తర్వాత లోపలికి వెళ్తాయి. తర్వాత 10–15 నిమిషాలలో ఫ్లాప్లను నెమ్మదిగా లోపలికి లాగుతారు” అని ఆయన అన్నారు.
మరో నిపుణుడు టెర్రీ టోజర్ మాట్లాడుతూ “వీడియోను చూసి చెప్పడం కష్టం, కానీ ఫ్లాప్లు విచ్చుకుని ఉన్నట్లు కనిపించడం లేదు. విమానం సరిగ్గా టేకాఫ్ కాలేకపోవడానికి అదే కారణం కావచ్చు” అని అన్నారు.”ఫ్లాప్లను సరిగ్గా సెట్ చేయకపోతే, అది మానవ తప్పిదం కావచ్చు. కానీ, వీడియో దానిని నిరూపించేంత స్పష్టంగా లేదు” అని మాజీ పైలట్, బకింగ్హామ్షైర్ న్యూ యూనివర్సిటీలో సీనియర్ లెక్చరర్ అయిన మార్కో అన్నారు అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తులో సహాయం చేయడానికి యూకే నుంచి అధికారులు భారత్ వస్తున్నారు.
ఇండియాలోని ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకు సాయం చేయడానికి సిద్ధమని తాము అధికారికంగా చెప్పినట్లు యూకే ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ (ఏఏఐబీ) తెలిపింది.విమానంలో బ్రిటిష్ పౌరులు ఉన్నందున, యూకే బృందానికి దర్యాప్తులో నిపుణుల హోదా ఇవ్వనున్నారు.”మేం నిపుణుల బృందాన్ని ఇండియాకు పంపుతున్నాం. ఈ విషాద సమయంలో ఈ ఘటనతో ప్రభావితమైన ప్రతి ఒక్కరి గురించి మేం బాధపడుతున్నాం” అని ఏఏఐబీ తెలిపింది.అమెరికా దర్యాప్తు అధికారులు కూడా భారత్ రానున్నారు.
యూఎస్ బృందానికి నాయకత్వం వహించనున్నట్లు, క్రాష్ దర్యాప్తుకు సహాయం చేయనున్నట్లు నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్టీఎస్బీ) ఎక్స్లో తెలిపింది.ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏవో) అంతర్జాతీయ ప్రోటోకాల్లకు అనుగుణంగా భారత ప్రభుత్వం అవసరమైన సమాచారాన్ని అందిస్తుందని పేర్కొంది.కూలిపోయిన విమానం బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్. ఇది అమెరికాలో తయారైంది.అయితే, ఈ విమాన ప్రమాదం నుంచి రమేశ్ విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.
మరోవైపు ఇండియా టుడేతోపాటు పలు మీడియా సంస్థలు రమేశ్ విశ్వాస్ కుమార్ ప్రమాద స్థలం నుంచి గాయాలతో వెళుతున్న దృశ్యాలను ప్రసారం చేశాయి.”బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానంలో సీటు 11A లో కూర్చున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు” అని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జీఎస్ మాలిక్ వార్తాసంస్థ ఏఎన్ఐతో చెప్పారు.ప్రాణాలతో బయటపడిన వ్యక్తి “ఆసుపత్రిలో ఉన్నారు. చికిత్స పొందుతున్నారు” అని ఆయన తెలిపారు.
ఎయిర్ ఇండియా అధికారులు ముందుగా షేర్ చేసిన ఫ్లైట్ మ్యానిఫెస్ట్లో 11A సీటులో ఉన్న ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేష్ అని, ఆయన బ్రిటిష్ పౌరుడని ఉంది.విశ్వాస్తో ఆసుపత్రిలో మాట్లాడినట్లు ఏఎన్ఐ తెలిపింది. తన బోర్డింగ్ పాస్ను తమకు షేర్ చేశారని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. అందులో ఆయన పేరు, సీటు నంబర్ 11A ఉన్నట్లు తెలిపింది.”టేకాఫ్ అయిన 30 సెకన్లకు పెద్దగా శబ్ధం వినిపించింది. ఆ తర్వాత విమానం క్రాష్ అయింది. ఇదంతా చాలా వేగంగా జరిగింది” అని విశ్వాస్ చెప్పినట్లుగా ఏఎన్ఐ తెలిపింది.