టాలీవుడ్ లో ఎంతోమంది తమ ఎంట్రీకి స్పూర్తిగా నిలిచింది ఆయనే అంటూ మెగాస్టార్ చిరంజీవి గురించి చెబుతుంటారు. అలాంటి వారి లిస్ట్ చాలా పెద్దదే.. ఐతే వారిలో తాను కూడా ఉన్నానని చెబుతున్నాడు ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల.ఆయన పేరు వినగానే ఎలా అయితే మంచి భావన కలుగుతుందో ఆయన సినిమాలు కూడా అంతే ఆహ్లాదకరంగా ఉంటాయి. ఫ్యామిలీ అంతా ఒకచోట కూర్చుని చూసే సినిమాలు తీసే దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. ఆనంద్ తో మొదలైన ఆయన సినీ ప్రస్థానం 25 ఏళ్లు పూర్తి చేసుకుంది.ఐతే తన పాతికేళ్ల సినీ ఉత్సవాన్ని తనను ఇక్కడ దాకా వచ్చేలా చేసిన మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో జరుపుకోవాలని కోరుకున్నాడు శేఖర్ కమ్ముల అలానే ఆయన కోరిక ప్రకారమే మెగాస్టార్ చిరంజీవి సమక్షంలోనే శేఖర్ కమ్ముల పాతికేళ్ల సినీ పండగ జరిగింది. ఐతే ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల తన సోషల్ మీడియాలో ఒక క్రేజీ మెసేజ్ రాసుకొచ్చారు. ఎప్పుడు తను చెప్పే మాటల్లో కూడా స్పష్టత చూపించని శేఖర్ కమ్ముల ఈ మెసేజ్ లో చిరంజీవి పై ఉన్న అభిమానం ఎలాంటిదో చూపించాడు.
ఇంతకీ ఆయన ఏం రాసుకొచ్చారు అంటే.. టీనేజ్ లో చిరంజీవి గారిని ఒకసారి దగ్గరగా చూశాను.. ఈయనతో సినిమా తీయాలి అనే ఫీలింగ్ ఉండేది.. ఆ ఫీలింగ్ తోనే ఇండస్ట్రీకి వచ్చా.. ఐతే పాతికేళ్ల ఉత్సవాన్ని సెలబ్రేట్ చేద్దామని మా టీం అంటే నాకు గుర్తొచ్చింది చిరంజీవి గారే.. కొన్ని జనరేషన్స్ ఇన్ స్పైర్ చేసిన పర్సనాలిటీ ఆయన. ఛేజ్ యువర్ డ్రీమ్స్, సక్సెస్ ఫాలో అనే నమ్మకం ఇచ్చింది చిరంజీవి గారే. అందుకే పాతికేళ్ల జర్నీ సెలబ్రేషన్ ఆయన ప్రజన్స్ లో జరుపుకోవాలని అనిపించింది.. థాంక్ యు సార్ అంటూ రాసుకొచ్చారు శేఖర్ కమ్ముల.
మెగాస్టార్ చిరంజీవి స్పూర్తితోనే దర్శకుడిగా మారి గొప్ప సినిమాలు చేస్తూ వస్తున్నారు శేఖర్ కమ్ముల. శేఖర్ కమ్ముల మెగా అభిమానం చూసి ఆడియన్స్ అంతా సర్ ప్రైజ్ అవుతున్నారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల పాతికేళ్ల సినీ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం శేఖర్ కమ్ముల ధనుష్ తో కుబేర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మన కింగ్ నాగార్జున కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు.