ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన అనంతరం బెంగళూరులో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయోత్సవం విషాదాంతంగా మారింది. చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన ఈ వేడుకలో ఊహించని విధంగా ఏర్పడిన బీభత్సం వల్ల 11 మంది అభిమానులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనలో 47 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనపై స్పందించిన బెంగళూరు నగర పోలీసులు ఆర్సీబీ ఫ్రాంచైజీ, ఈవెంట్ నిర్వహణ సంస్థ DNA ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్, అలాగే కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) పరిపాలనా కమిటీపై… క్రిమినల్ నిర్లక్ష్యం ముద్రతో FIR నమోదు చేశారు.
ఘటనపై సీరియస్గా తీసుకున్న పోలీసులు కేసును క్రైం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID)కు అప్పగించారు. ప్రత్యేక విచారణ కొనసాగుతోంది. సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడమే ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా పేర్కొన్నారు.
ఈ ఘటనను కర్ణాటక హైకోర్టు సుమోటోగా స్వీకరించి… జూన్ 10వ తేదీలోపు నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మృతుల కుటుంబాలకు ఆర్సీబీ మ్యానేజ్మెంట్ రూ.10 లక్షలు, గాయపడిన వారికి వైద్య సహాయం, మద్దతును అందించేందుకు “RCB Cares” పేరుతో ప్రత్యేక సహాయక కార్యక్రమాన్ని ప్రకటించింది.