తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్
బీఆర్ఎస్ ను తిట్టి తిట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏం చేస్తోంది?
ఎస్ఎల్ బీసీ, నక్కలగండి, డిండి ప్రాజెక్ట్ లు ఎప్పుడు పూర్తి చేస్తారు?
సుంకిశాల ప్రమాదంపై కాంట్రాక్ట్ సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేఘాతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులది ఫెవికాల్ బంధం ఏంటీ?
కృష్ణానది నీళ్లు తేవటంలో అలసత్వం ప్రదర్శిస్తే సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తాం.వెంకట్ రెడ్డి అన్న నాతో ఏం పంచాయితీ ఉంది? మా పిల్లల్ని ఎందుకు అరెస్ట్ చేయించావు?జాగృతితో పెట్టుకున్నోళ్లు ఎవరు బాగుపడలేదు.ఇప్పుడు రాజకీయాలు చేయటానికి రాలేదురాజకీయాలు చేసినప్పుడు మీకు గట్టి పోటీదారులను పెడతాం.ముందు ప్రజల దగ్గరకు వెళ్లి వాళ్ల దుఖాన్ని చూడండి.నల్గొండ జిల్లా అంటేనే ఎంతో చరిత్ర కలిగిన జిల్లా.రాజ్యాలు, ప్రజా ఉద్యమాలు, విప్లవాత్మక ఆలోచనలు కలిగిన ప్రాంతం.ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే ఒకప్పుడు బౌద్ధం, జైనం తో పాటు అద్భుతమైన ఆలోచన సరళి కలిగిన జిల్లా.ఉమ్మడి రాష్ట్రంలో మా ఇక్కడి చరిత్రను గుంటూరుకు తీసుకెళ్లారు.ఉద్యమం సమయంలో దీనిపై మేము పోరాటం చేశాం.నాగార్జున కొండ వద్ద ఉన్న స్థూపాన్ని కూడా గుంటూరు కు తీసుకెళ్లారు.
పానగళ్లు లో ఉన్న ఎన్నో విగ్రహాలను అక్కడకు తీసుకెళ్లారు.తెలంగాణ వచ్చాక కూడా అవన్నీ రిటర్న్ రాలే.జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ చరిత్ర కాపాడుకునే ప్రయత్నం జరుగుతుంది.మేము ఇక్కడి చరిత్ర తెలుసుకునే క్రమంలో 60 వేల ఏళ్ల చరిత్ర ఈ ప్రాంతానికి ఉందని తెలిసింది.పచ్చల, ఛాయ సోమేశ్వరం ఆలయాలు ఇక్కడ ఉన్నాయి.ఇంకో పక్క సాయుధ రైతాంగ పోరాటం జరిగింది.సాయుధ రైతాంగ పోరాటం చేయని ఇళ్లు ఇక్కడ లేదు.ఆనాటి ఉద్యమ కారులు మల్లు స్వరాజ్యం గారిని ఇటీవలే మనం కోల్పోయాం.కానీ ఇప్పటికీ కూడా జిల్లాలో అదే చైతన్యం ఉంది.ఆలోచనపరులు, చైతన్య వంతులు కలిగిన జిల్లా ఇది.తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలు తిరిగాను.హుజుర్ నగర్ లో సిమెంట్ ఫ్యాక్టరీలలో కొలువు కోసం కొట్లాట అనే కార్యక్రమాలు చేశాం.ప్రతి మండల కేంద్రంలో బతుకమ్మ ఎత్తుకొని నేను తిరిగాను.అలాంటి ఈ జిల్లాకు ఇప్పుడు జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా వచ్చాను.నేను ఇక్కడకు ఎందుకు వచ్చానో ఈ జిల్లా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది.
నీళ్లు, నిధులు, నియామాకాలు అనే నినాదంతో తెలంగాణ తెచ్చుకున్నాం.గత పదేళ్లలో చాలా విజయాలు సాధించాం. కానీ ఇంకా సాధించాల్సింది చాలా ఉంది.తెలంగాణ వచ్చాక మన నీళ్లు మనకు వస్తాయని అందరం అనుకున్నాం.కానీ నల్గొండ జిల్లాకు కృష్ణా నీళ్లు పూర్తి స్థాయిలో వచ్చాయో లేదో అందరం ఆలోచించాలి.మాధవ రెడ్డి ప్రాజెక్ట్, కృష్ణా, మూసీ, దిండి, ఎస్ఎల్ బీసీ ప్రాజెక్ట్ లతో జిల్లాకు నీళ్లు రావాలి. మూడున్నర లక్షలుఅదే విధంగా ఎస్సారెస్సీ తో కొంత కాళేశ్వరం, దేవాదుల ద్వారా కొంత నీళ్లు రావాలి.కానీ జిల్లాకు నీళ్లు అంటే కృష్ణానది మీదనే ఎక్కువ ఆధారపడాల్సిన పరిస్థితి.మరి బీఆర్ఎస్ పదేళ్లు, కాంగ్రెస్ రెండేళ్లు పన్నెండేళ్లలో కృష్ణానది నీళ్లు తెచ్చుకున్నామా ఆలోచన పరులు ఆలోచించాలి.నాగార్జున సాగర్ డ్యామ్ ఇక్కడే కనబడుతుంది. కానీ చుట్టు ఉన్న ఐదు మండలాలకు నీళ్లు రావు.నెల్లికల్లు ప్రాజెక్ట్ పూర్తైతే 5 మండలాలకు నీళ్లు వస్తాయి. కానీ ఇప్పటి వరకు ఎవరు పూర్తి చేయలేదు.బీఆర్ఎస్ ను ఇదే అంశంలో విమర్శించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఎందుకు పనులు చేయటం లేదు.బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా సరే సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి.అందుకే ప్రభుత్వాన్ని అడిగే వాళ్లు ఉండాలి. వారిపై ఒత్తిడి పెట్టినప్పుడే పనులు అవుతాయి.
ఇక్కడి సుంకిశాలను హైదరాబాద్ నీటి అవసరాలకు సెకండ్ అల్టర్ నేట్ అని గతంలో కేటీఆర్ గారు ప్రారంభించారు.ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటైనింగ్ వాల్ కొట్టుకుపోయిన పరిస్థితి.కనీసం ఆ విషయాన్నిబయటకు కూడా చెప్పలేదు.ఎంప్లాయిస్ తీసిన వీడియో ద్వారా ఆ విషయం బయటకు తెలిసింది.దీంతో ఆగమేఘాల మీద అధికారులను తీసేశారు. ఎంక్వైరీ వేశామన్నారు.విచారణ కమిటీ కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని సూచించింది.కానీ కాంట్రాక్టర్ ను ఏమీ చేయలే. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి గారు ఒక్క మాట అనలే.
ఇక మేఘాతో సీఎం ఫెవికల్ బంధం తెలిసింది. ఆయన ఒక్క మాట మాట్లాడలేదు.ఇలాగే ఎన్ని ఏళ్లు పనులు చేసుకుంటూ పోతారు.కిష్టరాయినిపల్లె, నెల్లికల్ ప్రాంతాల్లో భూసేకరణ చేసిన 17 ఏళ్లు అవుతోంది.భూమి ఇచ్చిన వారి పరిస్థితి దయనీయంగా ఉంది. వారి కుటుంబంలో వారికి ఉద్యోగం ఇస్తామని ఇవ్వలేదు.నిర్వాసితులకు భూమి లేదు, ఉద్యోగం లేని పరిస్థితి.బంగారు తెలంగాణ అంటే మారాల్సింది పేదల జీవన పరిస్థితులు.కృష్ణా నది నీళ్లు తేవటంలో సీఎం గారు ఇలాగే అలసత్వం వహిస్తే…నిర్వాసితులతో కలిసి ఆయన ఇంటి ముందు ధర్నా చేస్తాం.
నిర్వాసితుల బాధ వర్ణనాతీతంగా ఉంది. ఏడ్చేందుకు కన్నీళ్లు కూడా లేనంత దయనీయంగా ఉంది వాళ్ల పరిస్థితి.నిన్న దేవరకొండలో వెల్ఫేర్ స్కూల్ కు వెళ్లాం.బీఆర్ఎస్ హయాంలోనే ఆ స్కూల్ కు 5 ఎకరాలు కేటాయిస్తే రెండు ఎకరాలు కబ్జా అయ్యింది.పడుకునే చోటనే పిల్లలు చదువుకునే పరిస్థితి ఉంది.బీఆర్ఎస్ ను ఇవే అంశాలపై తిట్టి తిట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.కానీ స్కూల్స్, వెల్ఫేర్ హాస్టల్స్ ను పట్టించుకోవటం లేదు.కలెక్టర్లు వారానికి ఒకసారి సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో నిద్ర చేయాలని సీఎం గారు చెప్పారు.
ఎక్కడైనా కలెక్టర్లు ఆ మాటను పట్టించుకున్నారా? సీఎం మాట అంటే కలెక్టర్లకు లెక్క లేదు.ఉదయం మేము మెటర్నటీ హాస్పిటల్ కు వెళ్లాం.ఒక్కో బెడ్ మీద ఇద్దరు పేషెంట్లను, పిల్లలను పడుకోబెట్టారు.డాక్టర్లు, నర్సుల ఓపికకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. సౌకర్యాలు లేకపోయినా వారు పనిచేస్తున్నారు.కానీ రాజకీయ నాయకులుగా మనం ఫెయిల్ అవుతున్నాం.హాస్పిటల్ డెవలప్ మెంట్ అథారిటీ అని ఒకటి ఉంటుంది.రోజు వారీ అవసరాలకు ఇక్కడి హాస్పిటల్ లక్షా 20 వేల ఖర్చు ఉంటుంది.హాస్పిటల్ డెవలప్ మెంట్ అథారిటీ వద్ద డబ్బులు లేవు. సూపరిండెంట్ వద్ద పెట్టి క్యాష్ లేదు.ప్రతిదానికి పైకి లేఖ రాస్తూ డబ్బులు రావాలంటే జరగాల్సి న డ్యామేజ్ అప్పటికే జరిగిపోతుంది.
పిడియాట్రిక్ లో విభాగంలో ఓ బిడ్డ పరిస్థితి దయనీయంగా ఉంది.ఎంఆర్ఐ లేకపోవటంతో డాక్టర్లు కూడా ఆచేతన స్థితిలో ఉండిపోయారు.నీలోఫర్ హాస్పిటల్ కు వెళ్లాల్సిన పరిస్థితి. తల్లితండ్రుల వద్ద రూపాయి లేదు.మా జాగృతి తరఫున వారిని నీలోఫర్ కు పంపించే ఏర్పాటు చేశాం.కానీ ఎంతమందికి ఈ పరిస్థితి. ప్రభుత్వపరంగా సిస్టమ్ ఛేంజ్ కావాలి.ఇవి రాజకీయాలు ఎంత మాత్రం కావు. లాస్ట్ ఇయర్ లో రాజకీయాలు చేద్దాం.ప్రభుత్వ హాస్పిటల్ లో ఎపిడ్యూరెల్ లేని పరిస్థితి.బిడ్డలను కన్నా వారికి నొప్పి లేకుండా ఈ మందు ఇవ్వాల్సి ఉంటుంది.
కానీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆ మందు లేకపోవటంతో ఇంకా ఆటవిక కాలం మాదిరిగా మహిళలు ప్రసవ వేదన పడుతున్నారు.వారు బిడ్డలను కనేటప్పుడు పడే వేదన మరో జన్మ ఎత్తినట్లుగా ఉంటుంది.ఈ విషయంలో నేను మహిళలకు క్షమాపణ చెబుతున్నా.గత ప్రభుత్వం లో ఉన్నప్పుడు నాకు కూడా ఎపిడ్యూరెల్ హాస్పిటల్ లో ఉంచాలన్న ఆలోచన రాలేదు.హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా గారు జెంటిల్ మెన్.మిడియా ద్వారా ఆయనకు రిక్వెస్ట్ చేస్తున్నా. కచ్చితంగా హాస్పిటల్ లో ఎపిడ్యూరెల్ ఉంచాలని కోరుతున్నా.మీ ద్వారానైనా ఒక మంచి మార్పు రావాలని విజ్ఞప్తి చేస్తున్నా.ఇవ్వాళ మేము హాస్పిటల్ కు పోతాం అనగానే జిల్లా మంత్రి కూడా హాస్పిటల్ విజిట్ కార్యక్రమం పెట్టుకున్నారంట.
మేము వెళ్లే వరకు కూడా ఆయన హాస్పిటల్ విజిట్ చేయాలన్న ఆలోచన ఎందుకు రాలేదో?ఆయన వెళ్లిన తర్వాతనైనా హాస్పిటల్ లో ఏమైనా మార్పులు వస్తాయో చూడాలి.మా పిల్లలు నా ప్రొగ్రామ్స్ కోసం కొన్ని ఫ్లెక్సీలు పెడితే అరెస్ట్ చేయించారంట.వెంకట్ రెడ్డి అన్న నాతో నీకు ఏమీ పంచాయితీ ఉందన్నా?పోలీసులకు చెప్పి మా పిల్లలను వదిలేయమనండి.ఇప్పుడు మేము రాజకీయాలు చేయాలని రాలేదు.రాజకీయాలు చేసే సమయంలో కచ్చితంగా చేస్తాం. ఈ జిల్లాలో మీకు గట్టి పోటీదారులను పెడతాం.మా జాగృతి కార్యకర్తలతో పెట్టుకోవద్దు. జాగృతి కార్యకర్తలతో పెట్టుకున్నోళ్లు బాగుపడలేదు.జిల్లాలో 13 లక్షల 44 వేేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వేశారు.
మిర్యాలగూడ రైస్ మిల్లుల హబ్ కావటంతో సగం ధాన్యం వాళ్లే కొనే పరిస్థితి ఉంది.మిగిలినవి 6 లక్షల మెట్రిక్ టన్నులే. వాటిని ప్రభుత్వం కొనాలిఇందుకోసం వెయ్యి కొనుగోలు కేంద్రాలు కావాలి. కానీ ఇప్పటి వరకు 375 కేంద్రాలు మాత్రమే తెరిచారు.కనీసం లక్ష మెట్రిక్ టన్నులను కూడా ఇప్పటి వరకు కొనలేదు.బోనస్ తప్పించుకునేందుకే రైతుల నుంచి ధాన్యం కొంటలేరు.వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా.అదే విధంగా సుంకిశాల ప్రమాదం పై కచ్చితంగా చర్యలు తీసుకోవాలిఎస్ఎస్ బీసీ టన్నెల్ ప్రమాదం పై ఏం చర్యలు తీసుకున్నారో మంత్రి గారు ప్రజలకు చెప్పాలి.కృష్ణా నది రైడ్ సైడ్ కెనాల్ మీటర్ రీడింగ్ ఏపీ చేతిలో ఉంటే…లెప్ట్ సైడ్ కేంద్రం ఆధీనంలో ఉంది.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేంద్రానికి మన ప్రాజెక్ట్ బాధ్యతను అప్పగించారు.
ఇప్పుడు మీటర్ రీడింగ్ తెలుసుకోవాలన్న తెలుసుకోలేని పరిస్థితి.వెంటనే కోమటి రెడ్డి గారు మీటర్ రీడింగ్ తెప్పించుకోవాలి.లెప్ట్ కెనాల్ ను మన ఆధీనంలోకి తేవాలి. లేదంటే ప్రతి రీడింగ్ కు ఆంధ్రావాళ్లను అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.అదే విధంగా ఎస్ ఎల్ బీసీ ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పాలి.దాని మీద ఆధారపడిన నక్కల గండి పరిస్థితి ఏంటీ?మెథ్యా నాయక్, నక్కల గండి ప్రాంతాలను మంత్రి గారు విజిట్ చేయాలి.దిండి పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు అధికారంలోకి వచ్చిన అదే పరిస్థితి.భూదాన్ భూముల విషయంలో అనేక విమర్శలు చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.ఇప్పుడు ఆ భూములను రీక్లెయిమ్ చేయాలి. రెండేళ్లలో ఏం కార్యాచరణ చేశారో చెప్పాలి.
మిర్యాల గూడ వద్ద దామర్లచర్ల యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఐదు యూనిట్లు నడవాలి.కానీ రెండు యూనిట్లు మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతావి ఎప్పుడు పూర్తి చేస్తారు?వీర్లపాలెం వారికి ఇంటికో ఉద్యోగం అని బీఆర్ఎస్ చెప్పింది.కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వంగా కాంగ్రెస్ ఆ పని పూర్తి చేయాలి. వారికి పరిహారం కూడా ఇవ్వాలి.మిర్యాల గూడలో భారీగా రైస్ మిల్లులు ఉన్నాయి.వాళ్లంతా ఎఫ్.సి.ఐ ద్వారా వంద మెట్రిక్ టన్నుల గోడౌన్ ఉండాలని కోరుతున్నారు.ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.అమెరికా, ఆఫ్రికా వాళ్లను ఇక్కడి వచ్చి వ్యాపారం చేయాలని సీఎం కోరుతున్నారు.మిర్యాలగూడను కూడా అదే స్ఫూర్తితో ఇండస్ట్రీ హబ్ చేయాలి.ఇక్కడ చాలా సమస్యలను స్థానికులు చెప్పారు.
మేము కమిటీలు వేసుకొని వాటి మీద పోరాటం చేస్తాం.మీ ఆడబిడ్డగా నేను చెప్పేది ఒక్కటే. ఫ్రెంచ్ విప్లవం స్ఫూర్తిగా తెలంగాణ పోరాటం చేశాం.స్వేఛ్చ, సమానత్వ, సౌభ్రాతృత్వం నినాదాలతో ఫ్రెంచ్ విప్లవ సక్సెస్ అయ్యింది.భూమి, భుక్తి, విముక్తి పేరుతో జరిగిన పోరాటం కూడా విజయ తీరాలను ముద్దాడింది.అదే విధంగా నీళ్లు, నిధులు, నియామాకాల నినాదంతో తెలంగాణ తెచ్చుకున్నాం.భౌగోళిక తెలంగాణ కాకుండా సామాజిక తెలంగాణ రావాలి. అందుకోసమే మా పోరాటం.అవకాశం, అధికారం, ఆత్మగౌరవం మా విధానం.సమాజంలో ఇంకా అవకాశాలు రాని వారికి అవకాశం రావాలి. తద్వారా అధికారం, ఆత్మగౌరవం దక్కాలి.మైనార్టీ, ఆడబిడ్డలు, బీసీలు ఎంత మంది ఉన్నారు? వారిలో ఎంత మందికి అధికారం దక్కింది?బడా వ్యాపారవేత్తల్లో ఎస్సీ, ఎస్టీలు ఎంత మంది ఉన్నారో చూడండి.అందరికీ గౌరవం దక్కాలంటే సామాజిక తెలంగాణ రావాల్సిందే.
అందుకు అనేక మార్గాల్లో పోరాటం చేయాల్సి ఉంటుంది.బీసీలకు 42 శాతం స్థానిక సంస్థల్లోనే కాదు చట్టసభల్లోనూ రిజర్వేషన్లు రావాలి.ఎస్సీ, ఎస్టీ లకు రాజ్యాంగ బద్ద రక్షణ ఉండటంతో కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతున్నారు.కానీ కులవివక్ష లేకుండా వారికి ఆత్మగౌరవం దక్కాలి.యాదాద్రిలో ముఖ్యమంత్రి గారు పైన ఛైర్ లో కూర్చొని దళిత మంత్రులను కింద ఛైర్ కూర్చొపెట్టిన వివక్షపూరిత ఘటన మనం చూశాం.ఎస్సీ, ఎస్టీ, మహిళలు, డబ్బులు లేని యువత పై వివక్ష ఉండకూడదు.మళ్లీ విద్యాసంస్థల్లో స్టూడెంట్ ఎలక్షన్స్ రావాలి.లేదంటే కొత్త నాయకత్వం రావటం కష్టం. కొత్త వాళ్లు రావాలంటే స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు ఉండాలి.కొత్త నాయకత్వం లేకపోవటంతో ఇప్పుడున్న నాయకుల వారసులు, బంధువులే రాజకీయాల్లోకి వస్తున్నారు.నియోజికవర్గాల పునర్విభజన అయితే రాష్ట్రంలో 65 నుంచి 69 మంది ఆడబిడ్డలు చట్ట సభల్లోకి వస్తారు.
గతంలో మేము లీడర్ అనే ప్రొగ్రామ్ చేశాం. ఇప్పుడు కూడా నాయకత్వానికి సంబంధించి ఆడబిడ్డలకు ట్రైయినింగ్ ఇస్తాం.జిల్లాల్లో నాయకులను తయారు చేసి వారిని ఎంపావర్ చేస్తాం.దీర్ఘకాలిక, తక్షణ సమస్యలు ఇలా రెండింటిపై పోరాటం చేసేలా మా ప్రణాళిక ఉంటుంది.జనంబాటకు జర్నలిస్టులు, డిజిటల్ మీడియా మిత్రలు ఎంతో సహకరిస్తున్నారుఎక్కడికి వెళ్లిన తమ ఇంటి ఆడబిడ్డ మాదిరిగా హారతి ఇస్తూ ప్రజలు స్వాగతం పలుకుతున్నారు.వారందరికీ నా ధన్యవాదాలు.ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తేవటమే మా లక్ష్యం.
ప్రాజెక్ట్ ల వద్ద నిర్వాసితుల పరిస్థితి దయనీయంగా ఉంది.మీ ఉమ్మడి జిల్లా మంత్రులు ప్రజల వద్దకు వెళ్లి వారి దుఖాన్ని చూడాలని కోరుతున్నా.తప్పు బీఆర్ఎస్ చేసినా, కాంగ్రెస్ చేసినా తప్పు తప్పే.బీఆర్ఎస్ తప్పు చేస్తేనే కాంగ్రెస్ ను గెలిపించారు. మీరు తప్పు చేస్తే వేరే వాళ్లను గెలిపిస్తారు.అందుకే ప్రభుత్వం తక్షణం ప్రజా సమస్యలపై స్పందించాలి.జూబ్లీహిల్స్ ఎన్నికలు రెఫరెండం అని సీఎం గారు చెప్పుకున్నారు.కానీ అక్కడ ఎవరు గెలిచినా ఫరక్ పడదు. 15 రోజులు మాత్రం రాజకీయ పార్టీలకు ఎంటర్ టైన్ మెంట్ అయ్యింది.ప్రజల సమస్యలు వీసమెత్తు కూడా తీరవు.జూబ్లీహిల్స్ ఎన్నికలు పూర్తవటం నాకు సంతోషంగా ఉంది.కనీసం ఇప్పుడైనా అధికారపక్షం, ప్రతిపక్షం ప్రజల సమస్యలపై దృష్టి పెడుతుంది.నల్గొండలో కనీసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదు.
మరో 30 ఏళ్లలో జనాభా డబుల్ అవుతుంది. రోగాలు పెరుగుతాయి.ఇక్కడి మంత్రి గట్టిగా అడిగి పనిచేయించుకునే నాయకుడని మేము అనుకుంటున్నాం.మరి మంత్రి గారు నల్గొండలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేయటం పై దృష్టి పెట్టాలి.ఇక ఈ ప్రాంతంలో చాలా సమస్యలు మా దృష్టి వచ్చాయి.వాటి పరిష్కారం కోసం మా నాయకులంతా పనిచేస్తాం.ఇక పత్తి రైతు పరిస్థితి దయనీయంగా ఉంది.20 శాతం తేమ ఉన్న సరే పత్తి కొనుగోలు చేయాలి.ఎకరానికి ఏడు క్వింటాళ్లే కొంటామన్న రూల్ తీసేయాలి.ఇప్పటికే ఈ సమస్యపై వ్యవసాయ మంత్రి, కేంద్ర మంత్రికి లేఖ రాశాం.
సుంకిశాల రిటైనింగ్ వాల్ కొట్టుకుపోయిన ఘటనలో కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదు – జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత#JagruthiJanamBaata pic.twitter.com/vqDyU5ewh0
— Telangana Jagruthi (@TJagruthi) November 12, 2025


















